రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్
ABN , Publish Date - May 02 , 2024 | 01:06 AM
పెద్దాపురం, మే 1: ఒక్క అవకాశం ఇవ్వండని ప్రజలను నిమ్మంచి అధికారంలోకి వచ్చిన జగన్రెడ్డి అనంతరం తన విధ్వంసకర పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని టీడీపీ కూటమి పెద్దాపురం అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప అన్నా రు. స్థానిక సుధా కాలనీలో ఉన్న క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం
పెద్దాపురం కూటమి అభ్యర్థి చినరాజప్ప
పెద్దాపురం, మే 1: ఒక్క అవకాశం ఇవ్వండని ప్రజలను నిమ్మంచి అధికారంలోకి వచ్చిన జగన్రెడ్డి అనంతరం తన విధ్వంసకర పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని టీడీపీ కూటమి పెద్దాపురం అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప అన్నా రు. స్థానిక సుధా కాలనీలో ఉన్న క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం జరిగిన టీడీపీలో చేరికలో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముందుగా చినరాజప్ప సమక్షంలో సామర్లకోట 14వ వార్డుకు చెందిన పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజప్ప మాట్లాడుతూ జగన్ చేతకాని పాలనతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయిందన్నారు. రాబోయే ఎన్నికల్లో తనకు, టీడీపీ కూటమి అభ్యర్థులకు ఓటువేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు అడబాల కుమారస్వామి, యార్లగడ్డ రవిచంద్రప్రసాద్ పాల్గొన్నారు.