ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు : ఎస్పీ
ABN , Publish Date - May 02 , 2024 | 01:02 AM
గొల్లప్రోలు రూరల్, మే 1: సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా పోలీసుశాఖ తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తి, చినజగ్గంపేట గ్రామాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఆ
గొల్లప్రోలు రూరల్, మే 1: సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా పోలీసుశాఖ తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తి, చినజగ్గంపేట గ్రామాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఆయన బుధవారం పరిశీలించారు. తాటిపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యువకులతో కలిసి ఎస్పీ క్రికె ట్ ఆడారు. ఎస్పీ వెంట గొల్లప్రోలు ఎస్ఐ బాలాజీ తదితరులు ఉన్నారు.