సదుం ఘటనలో 9 మందికి రిమాండ్
ABN , Publish Date - May 02 , 2024 | 02:56 AM
సదుం మండలం ఎర్రాతివారి పల్లెలో సోమవారం జరిగిన ఘర్షణలో మండల పరిధిలోని వేదాయపాలెం, గుట్టపల్లి, యాదమరి, దాసర్లపల్లి, రాజుపల్లి ప్రాంతాలకు చెందిన అనిల్కుమార్ రెడ్డి, వెంకటేష్, ఓం ప్రకాష్, వేణుగోపాల్ రెడ్డి, విశ్వనాథం, కృష్ణదుర్గ, వెంకటాచలపతి, సుబ్రహ్మణ్యం, నవీన్కుమార్లపై ఐపీసీ 307, 147,148,341,323 సెక్షన్ల కింద చిత్తూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పుంగనూరు రూరల్ సీఐ కృష్ణారెడ్డి, ఎస్ఐ మారుతీలు వీరిని తిరుపతిలోని ఒకటో అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి సత్య క్రాంతకుమార్ ఎదుట బుధవారం రాత్రి హాజరు పరిచారు.
తిరుపతి(నేరవిభాగం), మే 1: సదుం మండలం ఎర్రాతివారి పల్లెలో సోమవారం జరిగిన ఘర్షణలో మండల పరిధిలోని వేదాయపాలెం, గుట్టపల్లి, యాదమరి, దాసర్లపల్లి, రాజుపల్లి ప్రాంతాలకు చెందిన అనిల్కుమార్ రెడ్డి, వెంకటేష్, ఓం ప్రకాష్, వేణుగోపాల్ రెడ్డి, విశ్వనాథం, కృష్ణదుర్గ, వెంకటాచలపతి, సుబ్రహ్మణ్యం, నవీన్కుమార్లపై ఐపీసీ 307, 147,148,341,323 సెక్షన్ల కింద చిత్తూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పుంగనూరు రూరల్ సీఐ కృష్ణారెడ్డి, ఎస్ఐ మారుతీలు వీరిని తిరుపతిలోని ఒకటో అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి సత్య క్రాంతకుమార్ ఎదుట బుధవారం రాత్రి హాజరు పరిచారు. వీరికి ఈనెల 14వ తేదీవరకు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పినట్లు సీఐ కృష్ణారెడ్డి చెప్పారు. వారిని చిత్తూరు సబ్జైలుకు తరలించారు.