tdp: కూటమితోనే వడ్డెర్ల సంక్షేమం: మాజీ మంత్రి పల్లె
ABN , Publish Date - May 02 , 2024 | 12:32 AM
ఓబుళదేవరచెరువు, మే 1: కూటమి ప్రభుత్వంతోనే వడ్డెర్ల సంక్షేమం సాధ్యమని మాజీ మంత్రి పల్లె రఘునాఽథ రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలోని స్టేట్బ్యాంక్ మైదానంలో బుధవారం నియోజకవర్గంలోని వడ్డెర్లతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఇందులో పల్లె పాల్గొని మాట్లాడారు. కూటమి మేనిఫెస్టో వడ్డెర్లకు ఎంతో మేలు చేసేలా ఉందన్నారు. వైసీపీ కపట నాటకాలు ఆడుతోందని, వడ్డెర్లు నమ్మరాదని అన్నారు. కూటమి అఽధికారంలోకి వస్తే బీసీలకు మరింత రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తుందన్నారు.
ఓబుళదేవరచెరువు, మే 1: కూటమి ప్రభుత్వంతోనే వడ్డెర్ల సంక్షేమం సాధ్యమని మాజీ మంత్రి పల్లె రఘునాఽథ రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలోని స్టేట్బ్యాంక్ మైదానంలో బుధవారం నియోజకవర్గంలోని వడ్డెర్లతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఇందులో పల్లె పాల్గొని మాట్లాడారు. కూటమి మేనిఫెస్టో వడ్డెర్లకు ఎంతో మేలు చేసేలా ఉందన్నారు. వైసీపీ కపట నాటకాలు ఆడుతోందని, వడ్డెర్లు నమ్మరాదని అన్నారు. కూటమి అఽధికారంలోకి వస్తే బీసీలకు మరింత రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తుందన్నారు.
ఎన్నికల్లో జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలతో పాటు హిందూపురం పార్లమెంట్ స్థానంలో కూటమి అభ్యర్థులను గెలిపించుకుందామని, చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపునిచ్చారు. తర్వాత అందరూ చంద్రబాబు, మోదీ, పవనకల్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంజనప్ప, వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లెల జయరాం, నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు డీఎన మూర్తి, కన్వీనర్ జయచంద్ర, మాజీజడ్పీటీసీ పిట్టా ఓబుళరెడ్డి, బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి జెరిపిటి ఆంజనప్ప, పార్లమెంటు వడ్డెర సాధికార కమిటీ కార్యదర్శి పీట్ల సుధాకర్, పార్లమెంటు అధ్యక్షులు పల్లెపు రవీంద్ర, ఎంపీటీసీ శ్రీనివాసులు, జోన ల్ కోఆర్డినేటర్ నరసింహులు కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....