Share News

కూటమి పథకాలతో వైసీపీలో వణుకు

ABN , Publish Date - May 02 , 2024 | 12:30 AM

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోతో వైసీపీలో వణుకు మొదలైందని ఆ కూటమి శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ అన్నారు.

కూటమి పథకాలతో వైసీపీలో వణుకు
Umamaheswari presenting a donation of Rs.10 thousand to Bandaru Sravanishri

బుక్కరాయసముద్రం, మే 1: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోతో వైసీపీలో వణుకు మొదలైందని ఆ కూటమి శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ అన్నారు. బుధవారం శింగనమల మండలంలో జూలాకాలువ, పెద్దజ లాలపురం, చీలేపల్లి, ఇరువెందుల, కల్లుమడి, ఏకులనాగేపల్లి, తరిమెల గ్రామాల్లో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆమెతో పాటు ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణ, ద్విసభ్యకమిటీ సభ్యుడు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు పాల్గొన్నారు. కూటిమి రూపొందించిన పథకాలపై అన్ని వర్గాల ప్రజలూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ గుత్తా ఆదినారాయణ, రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి గంజే నాగరాజు, టీడీపీ నేతలు డేగల కృష్ణమూర్తి, మారుతి నాయుడు, మాజీ జెడ్పీటీసీ షాలిని, మాజీ ఎంపీపీ అమృత, ఈశ్వర్‌రెడ్డి, అమృత పాల్గొన్నారు.


బీకేఎస్‌లో ప్రచారం

బుక్కరాయసముద్రం గ్రామ పంచాయతీలోని కొట్టాలపల్లిలో రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్‌బాబు , పొడరాళ్ల రవీంద్రా, కన్వీనర్‌ అశోక్‌, కేశన్న, ఎస్‌నారాయణస్వామి, లక్ష్మినారాయణ, ఓబులపతి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.


నేడు పలు గ్రామాల్లో ప్రచారం

శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలంలో తిమ్మంపల్లి, కొడవండ్లపల్లి, అరవేడు, బుక్కాపురం, కూచివారిపల్లి, వాసాపురం, అచ్యుతాపురం, చిలంకూర్‌, కొడమూర్తి గ్రామాల్లో బండారు శ్రావణీశ్రీ ప్రచారం నిర్వహిస్తారు.


టీడీపీకి విద్యార్థి విరాళం

శింగనమల : మండలంలోని జూల్వాకాలువలో బుధవారం బండారు శ్రావణిశ్రీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ గ్రామానికి చెందిన ఎంసీఏ విద్యార్థి ఉమామహేశ్వరి తన ప్యాకెట్‌ మనీ రూ.10 వేలను పార్టీ ఫండు కింద బండారు శ్రావణిశ్రీకి అందజేశారు. టీడీపీ అధికారం వచ్చి చంద్రన్న సీఎం అయితేనే విద్యారంగం అభివృద్ధి సాధ్యమని ఆమె అన్నారు. చంద్రబాబు విద్యార్థులకు విదేశీ విద్యతోపాటు యువతకు నిరుద్యోగ భృతి అందజేశాడని, ఈ ఎన్నికల్లో యువత అంత టీడీపీ వైపు మొగ్గు చూపడం తథ్యమని అన్నారు.


నార్పలలో ప్రచారం

నార్పల : టీడీపీ జిల్లా నాయకుడు ఆలం వెంకటనరసానాయుడు నార్పలలో సత్యసాయి కాలనీలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలం నాగార్జున నాయుడు, ఉషోదయ సుధాకర్‌, మాజీ కో-ఆప్షన పీరా, ఆలం నాగార్జున, ప్రతాప్‌చౌదరి, పీఎల్‌ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.


మరిన్ని వార్తల కోసం...

Updated Date - May 02 , 2024 | 12:30 AM