ముస్లింల ద్రోహి.. జగన
ABN , Publish Date - May 02 , 2024 | 12:24 AM
ముస్లిం మైనార్టీల ద్రోహి జగన అని శాసన మండలి మాజీ చైర్మన షరీఫ్ మండిపడ్డారు. బుధవారం రాత్రి నగరంలోని ఓ కన్వెక్షన హాల్లో నిర్వహించిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు.
అనంతపురం అర్బన, మే 1 : ముస్లిం మైనార్టీల ద్రోహి జగన అని శాసన మండలి మాజీ చైర్మన షరీఫ్ మండిపడ్డారు. బుధవారం రాత్రి నగరంలోని ఓ కన్వెక్షన హాల్లో నిర్వహించిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో ముస్లిం మైనార్టీలకు అన్ని విధాలుగా న్యాయం చేశామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. టీడీపీ హయాంలో అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేయడంతోపాటు కొత్తగా ఒక్క పథకం కూడా అమలు చేయకపోవడంతో ఆ వర్గాలు తీవ్రంగా నష్టపోయారన్నారు.
అనేక మంది ముస్లింలపై దాడులు చేయించి సీఎం జగన పైశాచిక ఆనందాన్ని పొందారన్నారు. వైసీపీ అసత్య ప్రచారాలను నమ్మకుండా ఈ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలంతా ఏకమై కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడుతూ... అధికారంలోకి రాగానే ముస్లిం మైనార్టీల ఇళ్ల స్థలాల కోసం 20 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన గౌస్మొద్దీన, మాజీ మున్సిపల్ చైర్మన నూర్ మహ్మద్, నాయకులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం...