tdp: కూటమితోనే రాష్ట్రాభివృద్ధి: కందికుంట
ABN , Publish Date - May 02 , 2024 | 12:25 AM
తనకల్లు, మే1: కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని చిన్నరామన్నగారిపల్లి, ఈతోడు పంచాయతీలోని గోపిరెడ్డిపల్లి, కొట్టువారిపల్లి, తొట్లివారిపల్లి, తొట్లివారిపల్లి దళితవాడ, తురకవాండ్లపల్లి, బిళ్లూరువాండ్లపల్లి, ఉప్ప వాండ్లపల్లి, రాకుంటపల్లి, చిన్నచెరువుపల్లి, ఈతోడు, టీ సదుం గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు.
తనకల్లు, మే1: కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని చిన్నరామన్నగారిపల్లి, ఈతోడు పంచాయతీలోని గోపిరెడ్డిపల్లి, కొట్టువారిపల్లి, తొట్లివారిపల్లి, తొట్లివారిపల్లి దళితవాడ, తురకవాండ్లపల్లి, బిళ్లూరువాండ్లపల్లి, ఉప్ప వాండ్లపల్లి, రాకుంటపల్లి, చిన్నచెరువుపల్లి, ఈతోడు, టీ సదుం గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు.
గ్రామాల్లో మహిళలు హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. ఆయన ఇంటింటికి తిరిగి కూటమి సైకిల్ గుర్తుకు ఓటేసి తనను ఎమ్మెల్యేగా, బీకే పార్థసారధిని ఎంపీగా గెలిపించాలని అభ్యర్థించారు. సూపర్ సిక్స్ పథకాల వల్ల ప్రతికుటుంబానికి లబ్ధి చేకూరుతుందన్నారు. యువతకు ఉద్యోగం రావాలన్నా, మహిళలకు సంక్షేమ పథకాలు అందాలన్నా చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. ఈతోడు గ్రామంలో కార్మిక సంఘాల నాయకులు చేపట్టిన మేడే వేడుకల్లో కందికుంట పాల్గొని కేక్ కట్ చేశారు. అలాగే వారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ రెడ్డిశేఖర్రెడ్డి, మార్కెట్యార్డు మాజీ చైర్మన ఈశ్వర్రెడ్డి, నాయకులు రాజారెడ్డి, శంకర్నాయుడు, బాగేపల్లి చలపతి, దినకర్ప్రసాద్నాయుడు, శ్రీరాములనాయక్, హరినాయక్, తోట సరోజమ్మ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....