bjp: సమస్యలన్నీ పరిష్కరిస్తా: సత్యకుమార్
ABN , Publish Date - May 02 , 2024 | 12:38 AM
ధర్మవరం రూర ల్, మే1: తనను ఆదరించి గెలిపిస్తే నిత్యం అందుబాటు లో ఉండి గ్రామాల్లో సమస్యలన్నింటినీ ప రిష్కరిస్తానని కూటమి బీజేపీ ఎ మ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్యాదవ్ ప్రజలకు భరోసా కల్పించారు. మండలంలోని ఓబుళనాయునిపల్లి, దర్శినమల, నడిమిగడ్డపల్లి, తండా, బిల్వంపల్లి, నేలకోట, నేలకోటతండా, బుడ్డారెడ్డిపల్లి, ఏలుకుంట్ల, తనకంటివారిపల్లి గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ధర్మవరం రూర ల్, మే1: తనను ఆదరించి గెలిపిస్తే నిత్యం అందుబాటు లో ఉండి గ్రామాల్లో సమస్యలన్నింటినీ ప రిష్కరిస్తానని కూటమి బీజేపీ ఎ మ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్యాదవ్ ప్రజలకు భరోసా కల్పించారు. మండలంలోని ఓబుళనాయునిపల్లి, దర్శినమల, నడిమిగడ్డపల్లి, తండా, బిల్వంపల్లి, నేలకోట, నేలకోటతండా, బుడ్డారెడ్డిపల్లి, ఏలుకుంట్ల, తనకంటివారిపల్లి గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
గ్రామాల్లో ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఆయన ఇంటింటా తిరిగి కమలం గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా, సైకిల్ గుర్తుకు ఓటు వేసి బీకే పార్థసారధిని ఎంపీగా గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారన్నారు. ఇక్కడ తనను ఆదరించి గెలిపిస్తే నిత్యం ఇక్కడే ఉండి అందరికీ అందుబాటులో ఉంటానని, సమస్యలన్నీ పరిష్కరిస్తానని, నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతానని హామీ ఇచ్చారు. ప్రజలు ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన చిగిచెర్ల ఓబిరెడ్డి, మాజీ ఎంపీపీ వేణుగోపాల్రెడ్డి, నాయకులు మద్దిలేటి, మహే్షచౌదరి, కన్వీనర్ పోతుకుంటలక్ష్మన్న, మాజీ జడ్పీటీసీ మేకలరామాంజినేయులు, ముత్యాలప్పనాయుడు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....