Share News

ACCIDENT : ఎద్దులబండిని ఢీకొన్న కంటెయినర్‌

ABN , Publish Date - May 02 , 2024 | 12:24 AM

జీవనోపాధి కోసం ఓ వ్యక్తి బుధవారం ఎద్దులబండిలో ఇసుక తరలిస్తుండగా వెనుక నుంచి కంటెయినర్‌ లారీ ఢీకొనడంతో ఎద్దు మృతిచెందింది. అతడు గాయాల పాలయ్యాడు. సోమందేపల్లికి చెందిన సుబ్బరాయుడు అనే వ్యక్తి అదే మండలంలో వెలగమాకుల పల్లి సమీపం లోని వంక నుంచి ఎద్దులబండిలో ఇసుక తరలిస్తున్నా డు. అతడు 44వ జాతీయ రహదారి మీదుగా సోమం దేపల్లికి వస్తుండగా మార్గమధ్యలో పాపిరెడ్డిపల్లి వద్ద తెల్లవారుజామున 6గంటల సమయంలో ఓ కంటెయినర్‌ లారీ ఎద్దులబండిని వెనుక నుంచి ఢీకొంది.

ACCIDENT : ఎద్దులబండిని ఢీకొన్న కంటెయినర్‌
A container hit bullock cart

ఎద్దు మృతి, వ్యక్తికి గాయాలు

పెనుకొండ టౌన(సోమందేపల్లి), మే1 : జీవనోపాధి కోసం ఓ వ్యక్తి బుధవారం ఎద్దులబండిలో ఇసుక తరలిస్తుండగా వెనుక నుంచి కంటెయినర్‌ లారీ ఢీకొనడంతో ఎద్దు మృతిచెందింది. అతడు గాయాల పాలయ్యాడు. సోమందేపల్లికి చెందిన సుబ్బరాయుడు అనే వ్యక్తి అదే మండలంలో వెలగమాకుల పల్లి సమీపం లోని వంక నుంచి ఎద్దులబండిలో ఇసుక తరలిస్తున్నా డు.


అతడు 44వ జాతీయ రహదారి మీదుగా సోమం దేపల్లికి వస్తుండగా మార్గమధ్యలో పాపిరెడ్డిపల్లి వద్ద తెల్లవారుజామున 6గంటల సమయంలో ఓ కంటెయినర్‌ లారీ ఎద్దులబండిని వెనుక నుంచి ఢీకొంది. పక్కనే ఉన్న హైటెన్షన విద్యుత స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ ఎద్దు మృతిచెందగా, అతడు గాయాల పాలయ్యాడు. గాయడిన సుబ్బరాయుడు సోమందేపల్లి ప్రభుత్వాసుప త్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 02 , 2024 | 12:24 AM