Share News

Telangana: ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తోన్న బీజేపీ.. నేడు తెలంగాణకు ఇద్దరు సీఎంలు, అగ్రనేతలు!

ABN , Publish Date - May 06 , 2024 | 08:32 AM

తెలంగాణలో బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. బీజేపీ అగ్ర నేతలంతా రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. నేడు మూడు బహిరంగ సభల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేరుకోనున్నారు. ఉదయం 10 గంటలకు పెద్దపల్లి, ఒంటి గంటకు భువనగిరి, మధ్యాహ్నం 3 గంటలకు నల్లగొండ బీజేపీ అభ్యర్థి మద్దతుగా నడ్డా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల‌ ప్రచారంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామీ, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మతో పాటు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు..

Telangana: ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తోన్న బీజేపీ.. నేడు తెలంగాణకు ఇద్దరు సీఎంలు, అగ్రనేతలు!

హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. బీజేపీ అగ్ర నేతలంతా రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. నేడు మూడు బహిరంగ సభల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) చేరుకోనున్నారు. ఉదయం 10 గంటలకు పెద్దపల్లి, ఒంటి గంటకు భువనగిరి, మధ్యాహ్నం 3 గంటలకు నల్లగొండ బీజేపీ అభ్యర్థి మద్దతుగా నడ్డా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల‌ ప్రచారంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామీ, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మతో పాటు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11గంలకు ముషీరాబాద్‌లో బీజేపీ యువ సమ్మేళనం నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామీ పాల్గొననున్నారు. 12.30 గంటలకు నర్సంపేట్‌లో పుష్కర్ సింగ్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్‌లో బీజేపీ ప్రవాసీ సమ్మేళనం జరగనుంది. రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఇవి కూడా చదవండి...

జగన్‌ అవినీతి వల్లే పోలవరం జాప్యం!

Pawan Kalyan: ఇవాళ ఒకే వేదికపైకి మోదీ, పవన్, నారా లోకేష్

For more latest News and Telangana News

Updated Date - May 06 , 2024 | 08:47 AM