రోహిత్‌తో 20 కిలోమీటర్లు పరిగెత్తిస్తా.. యువీ తండ్రి చాలెంజ్

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్.

టీమిండియా కెప్టెన్ రోహిత్‌పై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు యోగ్‌రాజ్.

తాను గనుక భారత జట్టు కోచ్‌నైతే రోజూ రోహిత్‌తో 20 కిలోమీటర్లు రన్నింగ్ కొట్టిస్తానని అన్నాడు యోగ్‌రాజ్. 

 తాను కోచ్‌నైతే ప్రస్తుత జట్టునే అన్‌బీటబుల్ టీమ్‌గా మారుస్తానని చెప్పాడు యువీ తండ్రి.

ఫామ్‌లోకి వచ్చేందుకు రోహిత్‌, కోహ్లీని రంజీల్లో ఆడిస్తానని పేర్కొన్నాడు. 

రంజీల్లో ఆడనని చెబితే హిట్‌మ్యాన్‌తో రోజూ 20 కిలోమీటర్లు రన్నింగ్ చేయిస్తానని వ్యాఖ్యానించాడు యోగ్‌రాజ్.

యువీనే కాదు.. ధోని, రోహిత్, కోహ్లీ.. ఇలా భారత జట్టుకు ఆడే వాళ్లంతా తన బిడ్డలేనని వివరించాడు.