రోజూ విష్ణు సహస్ర నామ పారాయణం చేయడం వల్ల కలిగే ఫలితాలు..

ఒత్తిడి, ఆందోళన, భయం తగ్గడంతోపాటు ఏకాగ్రత పెరుగుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. 

ఇది ఆధ్యాత్మిక చైతన్యాన్ని, భక్తిని పెంపొందిస్తుంది. ఆత్మ జ్ఞానాన్ని కలిగిస్తుంది. 

శారీరక వ్యాధులు తగ్గుతాయి. దుష్టశక్తుల నుంచి (మంత్ర తంత్రాల ప్రభావం) నుంచి రక్షిస్తూ.. రక్షణ కవచంగా పని చేస్తుంది. 

గత జన్మల పాపాలు తొలగిపోతాయి. జనన మరణ చక్రం నుంచి మోక్షం లభిస్తుంది.

ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి.. ఐశ్వర్యం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంలో సుఖశాంతులు చేకూరతాయి.

గ్రహాల ప్రతికూల ప్రభావాలు అంటే జ్యోతిష్య దోషాలు తగ్గుతాయి. 

ఉదయం లేదా సాయంత్రం వేళ.. దేవుని ఎదురుగా ఆవు నెయ్యి దీపం వెలిగించి.. పారాయణం చేయడం మంచిది. ఉచ్చరణ స్పష్టంగా ఉండడం కీలకం