డ్రగ్స్ కేసులో ఉన్నది వైసీపీ నేతలే: చంద్రబాబు

విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నది వైసీపీ నాయకులేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 

కూనం వీరభద్రరావుకు వైసీపీ నాయకులతో సంబంధాలున్నాయన్నారు. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫెక్సీల్లో జగన్, వైసీపీ నేతల ఫోటోలు ఉన్నట్లు గుర్తు చేశారు.

జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని గంజాయి కేంద్రంగా మార్చేశారని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్స్ క్యాపిటల్‌గా మార్చిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. 

గతంలో కాకినాడ ఎమ్మెల్యే డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటే.. ఆ కేసులో ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదని గుర్తు చేశారు. 

వైసీపీ నేతల అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని.. ఈ ఎన్నికల్లో ప్రజలు జగన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.