సీఎం జగన్‌పై మండిపడ్డ షర్మిల

జగన్‌పై ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. జగన్ ఎన్నికలకు 6 నెలల ముందు నిద్రలేచాడని ఆమె అన్నారు. 

ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు అంటూ హడావిడి చేస్తున్నారని, మద్యపాన నిషేధమని మోసం చేశారని ధ్వజమెత్తారు. 

మద్య నిషేధం అని చెప్పి జగన్ లిక్కర్ అమ్ముతున్నారు. ఎక్కడ చూసినా కల్తీ మద్యం. 

ఏపీలో కల్తీ మద్యం కారణంగా 25 శాతం అదనపు మరణాలు పెరిగాయి. అంతా భూమ్ భూమ్, డీఎస్సీ, క్యాపిటల్, స్పెషల్ స్టేటస్ బ్రాండ్లే కనిపిస్తున్నాయి. 

జగన్ హామీలు లిక్కర్ షాపులో నిలబడ్డాయని జమ్మలమడుగులో జరిగిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో ఆమె విమర్శించారు.

వైఎస్ వివేకా హత్య కేసులో 5 ఏళ్లయినా నిందితులను పట్టుకోలేకపోతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.