బరువు తగ్గాలనుకుంటున్నారా..  ఈ దోశ తినాల్సిందే ..

కావలసిన పదార్థాలు: ఇడ్లీ బియ్యం - రెండు కప్పులు, సొరకాయ ముక్కలు- ఓ కప్పు, ఎండు మిర్చి- ఎనిమిది, 

అల్లం- కొద్దిగ, జీలకర్ర- రెండు స్పూన్లు, ఇంగువ- చిటికెడు, ఉప్పు, నీళ్లు, నూనె- తగినంత.

ఇడ్లీ బియ్యాన్ని రెండు  గంటల పాటు నానబెట్టాలి. 

ఓ మిక్సీలో ఇడ్లీ బియ్యం, సొరకాయ ముక్కలు, ఎండు మిర్చి, జీలకర్ర, ఇంగువ, అల్లం వేసి రుబ్బుకోవాలి.

ఈ పిండిని రాత్రంతా నానబెట్టాలి.

మరుసటి ఉదయం దోశెలు వేసుకుంటే సాఫ్ట్‌గా బాగుంటాయి.