మీకు తెలుసా..? ఈ భారతీయ నగరాల్లో మాంసాహారాన్ని బ్యాన్ చేశారు..!

భారతదేశ జనాభాలో శాకాహారులు 40 శాతం మంది ఉన్నారు.

మాంసాహారాన్ని నిషేధించిన 7 ప్రముఖ నగరాలు ఉన్నాయి. ఈ నగరాలలో మాంసాహారం దొరకదు.

వారణాసి.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి తూర్పు న ఉన్న వారణాసి నగరంలో మాంసాహారం బ్యాన్ చేశారు.  ఈ నగరాన్ని శివుడు నిర్మించాడని నమ్ముతారు. నగరం మొత్తం మీద శాకాహారమే దొరుకుతుంది.

హరిద్వార్.. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉండే హరిద్వార్ నగరంలో పవిత్రమైన గంగానది ప్రవహిస్తుంది. ఇక్కడ వెజ్ ఫుడ్స్ మాత్రమే దొరుకుతాయి.

రిషికేశ్.. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే ఉన్న రిషికేశ్ ను దేవ భూమి అని అంటారు. ఇక్కడ కూడా మాంసాహారం నిషేధించారు.

మధురై.. తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో మీనాక్షి అమ్మవారి దేవాలయం ఉంటుంది. ఇక్కడ శాకాహారానికి చెందిన రుచికరమైన వంటకాలు మాత్రమే లభ్యమవుతాయి.

అయోధ్య.. ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యా నగరం  రామ జన్మస్థలం. కాబట్టి ఇక్కడ మాంసాహారం నిషేధించారు.

పాలిటానా.. గుజరాత్ రాష్ట్రంలోని పాలిటానా నగరంలో మాంసాహారం పూర్తీగా నిషేధించబడింది.

బృందావన్.. ఉత్తర  ప్రదేశ్ రాష్ట్రంలోని మధుర జిల్లాలో బృందావన్ ఉంది. ఇక్కడ మాంసాహారం దొరకదు.