మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది.

అయితే టెన్షన్ పడితే అనేక రోగాలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఎంత పని ఒత్తిడి ఉన్నా టెన్షన్ తగ్గించుకుని ప్రశాంతంగా ఉండాలంటున్నారు.

బాగా టెన్షన్ పడితే హైబీపీ వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

గుండెపోటు, మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

జీర్ణ వ్యవస్థను దెబ్బ తీసి అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ సమస్యలు తెస్తుంది.

విపరీతమైన ఒత్తిడి.. తలనొప్పి, నిద్రలేమి సమస్యకు కారణం అవుతుంది.

ఎక్కువ కాలంపాటు టెన్షన్ పడుతూ ఉంటే ఆందోళన, డిప్రెషన్‌కు గురవుతారు.

అందుకే యోగా, మెడిటేషన్ వంటివి చేసి టెన్షన్ తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.