మిగిలిపోయిన ఆహారాలను వేడి చేసి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. కొన్ని ఆహార పదార్థాలను వేడి చేసి తింటే ఏమవుతుందో తెలుసుకుందాం. 

మిగిలిపోయిన అన్నాన్ని వేడి చేసి తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది. 

టీని పదే పదే వేడి చేసి తాగడం వల్ల కడుపునొప్పి, నిద్రలేమి సమస్య తలెత్తే ప్రమాదం ఉంది.

బచ్చలికూరను వేడి చేయడం వల్ల ఐరన్ ఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. 

వంట నూనె పదే పదే వేడి చేయడం వల్ల హానికరణమైన సమ్మేళనాలు ఉత్పత్తి అవుతాయి. తద్వారా హృదయ సంబంధ వ్యాధులు తలెత్తుతాయి. 

పుట్టగొడుగులను వేడి చేయడం వల్ల బ్యాక్టీరియా పెరిగిపోతుంది. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది. 

ఈ సలహాలు కేవలం అవగాహన కోసమే. ఏవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.