ఒంటికి చలవ చేసే వాటిల్లో  మొదటి వరుసలో ఉంటుంది కీరదోస.

ఇందులో సోడియం, పీచు, కాపర్, పొటాషియం, మాంగనీస్, భాస్వరం, మెగ్నీషియం, ఎ, బి1, సి, కె విటమిన్లు, ప్రొటీన్లు ఉన్నాయి

95 శాతం నీరే ఉంటుంది కనుక డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తదు.

కీరదోస తినడం వల్ల జీర్ణప్రక్రియ సజావుగా ఉంటుంది. శరీరంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. రక్తపోటు క్రమబద్ధంగా ఉంటుంది

కీరదోసలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది

మలబద్ధకం సమస్య ఉన్నవారు దీనిని రాత్రిపూట తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు

నిపుణుల అభిప్రాయం ప్రకారం కఫ దోషం పెరిగిన వ్యక్తులు రాత్రిపూట  కీరదోస తినకూడదు

వీరు పొరపాటున కూడా రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన కీరదోస అస్సలు తినకూడదు. ఫలితంగా దగ్గు సమస్య పెరుగుతుంది