పానకం తాగడం వల్ల ఇంత ఎనర్జీ వస్తుందా..? 

శ్రీరామ నవమి వేళ.. స్వామి వారి ప్రసాదంగా భక్తులకు పానకం ఇస్తారు. 

ఈ పానకం తాగడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వేసవి తాపాన్ని తగ్గించే అద్భుతమైన ఆరోగ్య పానీయం. 

బెల్లం, మిరయాలు, యాలకులు, అల్లం/శొంఠి మిశ్రమంతో దీనిని తయారు చేస్తారు. 

వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా.. శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది సహజమైన కూలెంట్.

బెల్లంలోని ఐరన్, మినరల్స్.. అలసటను తగ్గించి వెంటనే శరీరానికి శక్తిని ఇస్తాయి.

పానకం తయారీలో వినియోగించే మిరియాలు, అల్లం, యాలకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

వేసవిలో అధిక వేడి వల్ల శరీరంలో నీరు తగ్గుతుంది. పానకం తాగడం వల్ల హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. 

మిరియాలు, యాలకులు, తులసీ ఆకులు వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.