కడుపు పూత సమస్యా.. ఇదిగో సింపుల్ చిట్కా

అరటి పండుతోనే కాదు.. ఆ చెట్టు పువ్వుతో సైతం అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

అరటి పవ్వులో అనేక ఔషధ గుణాలున్నాయి.   

ఈ పువ్వులో శరీరానికి అవసరమైన ఫైబర్, ప్రోటీన్లు, పొటాషియం, విటమిన్లు ఎ, సి, ఈ, కె పుష్కలంగా ఉంటాయి. 

వీటిలో ఉండే అధిక పొటాషియం వల్ల రక్తపోటును నియంత్రించ వచ్చు. రక్తహీనత నివారించేందుకు ఇది ఎంతో దోహదపడుతుంది. 

శరీరంలో వ్యాధి కారక బాక్టీరియా పెరగకుండా అరటి పువ్వు మందుగా పని చేస్తుంది. దీనిలోని రసాయనాలు.. క్యాన్సర్, గుండె జబ్బులతో పోరాడటానికి సహాయపడతాయి. 

వీటిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీంతో మలబద్దక సమస్య తగ్గుతుంది.

మధుమేహం ఉన్న వారికి ఇది గొప్ప ఆహారం. ఇందులోని ప్లేవానాయిడ్స్ అద్భుతమైన ఇన్సులిన్ వాహకాలుగా పని చేస్తాయి.

అరటి పువ్వుతో చేసిన వంటకాలు తినటం వల్ల కిడ్నీలో రాళ్లను తొలగిస్తుంది. 

వంద మిల్లీగ్రాముల అరటి పువ్వు రసాన్ని ఉదయం మూడుసార్లు తీసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

ఊబకాయంతో బాధపడేవారు అరటి పువ్వుతో చేసిన సూప్ తీసుకుంటే మంచిది. అందులో అల్లం, కోత్తి మీరతోపాటు కొద్దిగా ఉప్ప వేసి తీసుకుంటే మంచిది. ఇలా వారానికి ఐదు సార్లు తీసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది.

కడుపు పూత నివారణకు అరటి పువ్వు అద్భుతంగా పని చేస్తుందని చెబుతారు. 

మూత్ర విసర్జన చేసేటపుడు బాధగా ఉంటే అరటి పువ్వ తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

కడుపు ఉబ్బరంగా ఉండి విపరీతంగా వాంతులు అవుతుంటే అరటి పువ్వను తీసుకుంటే మంచిది.

అరటి పువ్వుతో చేసిన వంటకాన్ని రోజూ వారీ తీసుకుంటే స్త్రీలకు శక్తి, గర్భాశయ సమస్యలు తలెత్తవు.

అరటి పువ్వు రసాన్ని తేనెతో ఉదయం వేళ పరగడపున తీసుకుంటే రుతుస్రావ సమస్యలన్నీ తొలగిపోతాయి.