ప్రముఖ గ్లోబల్ టెక్ కంపెనీ ఆపిల్‌లో మళ్లీ లే ఆఫ్స్ ప్రకటించనున్నట్లు వార్తలొస్తున్నాయ్

ఆపిల్ తన ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను కుదిస్తోందని తెలుస్తోంది

ఇటివల యాపిల్ సంస్థపై అమెరికా ప్రభుత్వం దావా వేయడంతో పెద్ద ఎత్తున నష్టపోయింది

ఈ క్రమంలోనే ఐ ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ పలు ప్రాజెక్టులను మూసేస్తుంది

దీంతో ఆ ప్రాజెక్టులలో పని చేస్తున్న ఉద్యోగులకు లే ఆఫ్ ఇవ్వనుందని సమాచారం

ఇటివల ‘సెల్ఫ్ డ్రైవింగ్ కారు’ ప్రాజెక్టును యాపిల్ సంస్థ రద్దు చేసింది

ఇప్పుడు స్మార్ట్ వాచ్ డిస్ ప్లే డిజైనింగ్ అండ్ డెవలపింగ్ ప్రాజెక్టును కూడా క్లోజ్ చేస్తుంది

దీంతోపాటు మైక్రో ఎల్ఈడీ టెక్నాలజీతో కూడిన స్క్రీన్ల తయారీని కూడా నిలిపేసింది

అయితే డిస్ ప్లే తయారీ ఖర్చు ఎక్కువ కావడంతోనే యాపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం

దీంతో అమెరికా సహా ఆసియా ఖండాల్లోని యాపిల్ యూనిట్లలో డజన్ల కొద్దీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది

అయితే ఎంత మంది ఉద్యోగులను తొలిగించారన్న విషయాన్ని మాత్రం యాపిల్ తెలుపలేదు