Home » YS Sharmila
ఆస్తుల్లో వాటాల పంపిణీకి ఈడీ కేసులు, జప్తు కారణమనే వాదనను పీసీసీ అధ్యక్షురాలు షర్మిల భర్త అనిల్ కుమార్ తోసిపుచ్చారు.
వైసీపీపై ప్రజలకు నమ్మకం పోయిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రెడిబులిటితో వారి సమస్యలపై అనునిత్యం పోరాటాలు చేయాలని, వారిలో భరోసా నింపే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని అన్నారు.
Andhrapradesh: వైఎస్సార్ కుటుంబంలో జరుగుతున్న ఆస్తి తగాదాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ‘‘నాకు ఎంతో బాధ కలుగుతోంది. నాకు వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ భిక్ష పెట్టారు. వైవీ సుబ్బారెడ్డి, నేను బాగుపడింది వైఎస్ విజయమ్మ వల్ల’’ అని అన్నారు.
అంతర్జాతీయ నేరస్తుడు చార్లెస్ శోభరాజ్కు ఏ మాత్రం తీసిపోని జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి నేరమయ జీవితం ముగింపు కూడా అలానే ఉండబోతుందన్నారు. లక్షల కోట్ల ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టినందుకే 16 నెలలు జైల్లో జంటగా చిప్పకూడు తిన్న సంగతి జగన్ రెడ్డి, సాయిరెడ్డి మర్చిపోకూడదని కనపర్తి శ్రీనివాసరావు అన్నారు.
శత్రువులతో చేతులు కలిపి అన్న జగన్పై కుట్రలు పన్నడం ఎవరి కోసమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
తన అన్న జగన్మోహన్రెడ్డిపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మళ్లీ విరుచుకుపడ్డారు.
శత్రువులతో చేతులు కలిపి అన్న జగన్పై కుట్రలు పన్నడం ఎవరి కోసమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
జగన్ సంపదంతా తండ్రి, తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజా సంపదను దోచుకున్నదే కాని సక్రమ సంపాదన కాదన్నారు. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్రెడ్డి, సజ్జలరామకృష్ణారెడ్డి జగన్ ముఠాలో తోడుదొంగలు కాదా ..
వైఎస్ఆర్ మరణానంతరం చార్జిషీట్లో ఆయన పేరు చేర్పించింది మీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కాదా? అని విజయసాయిరెడ్డిని వైఎస్ షర్మిల నిలదీశారు. కేసుల నుంచి బయట పడటానికి పొన్నవోలుతో కలిసి ఈ కుట్ర చేయలేదా? అలా చేయకపోతే జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటగా అడ్వకేట్ జనరల్ పదవి ఎందుకు ఇచ్చారన్నారు. ఇప్పుడు మళ్ళీ తన స్వప్రయోజనం కోసం తల్లిని కోర్టుకు ఈడ్చిన విషపు నాగు జగన్ కాదా? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
‘‘ఆస్తి కోసం.. కన్న కొడుకే కోర్టుకు ఈడ్చి, కేసు పెట్టడంతో అమ్మ కుమిలిపోతోంది. ఇదంతా చూసేందుకే నేను ఇంకా బతికి ఉన్నానా అని రోదిస్తోంది’’ అని వైఎస్ విజయలక్ష్మి కుమార్తె, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.