Home » YS Sharmila
ఇసుక మాఫియాతో అన్నమయ్య డ్యాంను కూలగొట్టి 38 మంది ప్రాణాలు పోవడానికి మాజీ సీఎం జగన్ కారణమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పులిచింతల, గుళ్ళకమ్మ గేట్లు కొట్టుకుపోవడం జగన్ పాపం కాదా అని ప్రశ్నించారు. పోలవరానికి కేంద్రం ఇచ్చిన రూ. 3800కోట్లు దారి మళ్లించి నదుల అనుసంధానానికి గండి కొట్టారని మండిపడ్డారు.
ఇటీవల జగన్ తల్లి విజయలక్ష్మి రాసిన బహిరంగ లేఖలో రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ఆస్తుల పంపకం జరగలేదనే విషయాన్ని స్పష్టం చేశారు. 2019లో ఆస్తుల్లో వాటాల పంపకం ప్రతిపాదనను జగన్ తీసుకొచ్చారనే విషయాన్ని విజయలక్ష్మి తన లేఖలో పేర్కొన్నారు. ఈ సమయంలో షర్మిల భర్త బ్రదర్ అనిల్..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దు చేసేందుకు కుట్ర చేశామనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్గా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అభివర్ణించారు.
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కోసం ఎందుకు పనిచేస్తుందనే విషయాన్ని వైసీపీ మర్చిపోయిందా.. లేదంటే షర్మిలను రాజకీయంగా దెబ్బతీయడానికి జగన్ అసత్య ప్రచారాన్ని చేస్తున్నారా.. అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది. షర్మిల నిజంగానే జగన్కు అన్యాయం చేస్తుందా.. లేదంటే జగన్ తన సోదరి షర్మిల, తల్లి విజలక్ష్మికి అన్యాయం ..
జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో తల్లి, చెల్లికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేయడంతో విషయం బయటకు వచ్చింది. గతంలో తన సోదరి షర్మిల, తల్లి విజయలక్ష్మికి ఇచ్చిన వాటా షేర్లను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నట్లు పిటిషన్ వేశారు. దీంతో కుటుంబ ఆస్తుల వివాదం..
2019లో షర్మిలా రెడ్డికి 100 శాతం వాటాలు బదలాయిస్తామని జగన్ స్పష్టంగా పేర్కొంటూ ఎంవోయూ (MOU) మీద సంతకం చేశారని.. అప్పుడు బెయిల్ రద్దు అవుతుందని తెలియదా అని షర్మిల ప్రశ్నించారు. 2021లో క్లాసిక్ రియాలిటీ, సండూర్ పవర్కు చెందిన , సరస్వతి షేర్లను రూ. 42 కోట్లకు అమ్మ విజయమ్మకు ఎలా అమ్మారని నిలదీశారు.
‘తల్లిదండ్రులకు పిల్లలంతా సమానమే! కానీ... ఒక బిడ్డ మరో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోవడం చాలా కష్టం.
YSR Property Issue: వైఎస్ఆర్ ఆస్తుల పంపకం వివాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ వివాదంపై వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ షర్మిల ఈ అంశంపై పలు దఫాలుగా మాట్లాడగా.. ఇప్పుడు వైఎస్ విజయమ్మ ఎంటరయ్యారు. ఆస్తుల విషయంలో జగన్దే తప్పు అని క్లారిటీ ఇస్తూ..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు సంచలన విషయాలను బహిర్గతం చేశారు. ఆస్తుల విషయంలో వైఎస్ షర్మిలకు అన్యాయం జరిగిందని వైఎస్ విజయమ్మ వ్యాఖ్యానించారు.
జగన్, షర్మిల పేరిట దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొన్ని ఆస్తులు పెట్టారని ఆయన సతీమణి విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఇది ముమ్మాటికీ ఆస్తులు పంపకం కాదని అన్నారు. వైవీసుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఎన్నో అసత్యాలు చెప్పారని అన్నారు. వైఎస్ ఆస్తులు పంచారన్నది అవాస్తవమని విజయమ్మ స్పష్టం చేశారు.