Home » YS Rajasekhara Reddy
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి.. నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో మంత్రిగా బాలినేని పని చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు.
రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను జగన్ మార్చారని ఏపీ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు . దివంగ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఏడు కొండలను 2కొండలు అంటేనే ఎంతో పోరాటం చేశామని చెప్పారు. తనకు వ్యక్తిగతంగానూ తిరుమల శ్రీవారంటే చిన్నప్పటి నుంచీ ఎంతో నమ్మకమని సీఎం చంద్రబాబు తెలిపారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్రెడ్డి నివాళి అర్పించారు.
ప్రశాంతంగా ఉన్న చోట వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డుతున్నారా అంటే విశాఖలో జరిగిన ఓ ఘటన చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి ప్రతికూలంగా రావడంతో.. ఆపార్టీ నేతలు తీవ్ర నిరాశలో ఉన్నారు. మరోవైపు కొన్నిచోట్ల క్యాడర్ సైతం సైలెంట్ అయిపోయారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి మరిచి.. అరాచకాలకు పాల్పడిందనే అభిప్రాయం ప్రజల్లో ఉండటంతోనే వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కకుండా ప్రజలు వైసీపీపై ఉన్న కసిని తీర్చుకున్నారనే చర్చ బాగా జరిగింది.
‘కాంగ్రె్సకు దెబ్బ తగిలిన కడప జిల్లా నుంచే జెండా ఎగురవేద్దాం.. ఉప ఎన్నిక వస్తుందని ప్రచారం జరుగుతోంది.. వస్తే షర్మిల తరఫున ఊరూరా తిరిగే బాధ్యత నాదే..’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ఎదుటి వ్యక్తితో పని చేయించుకోవడంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో ఒక ప్రత్యేకత ఉండేదని ఆయన సన్నిహిత మిత్రుడు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్ట్రర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తగిన తనయా అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కితాబు ఇచ్చారు. వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఆమె ఇలా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
Telangana: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా నడుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం గాంధీభవన్లో నిర్వహించిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ...
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులంతా నివాళులర్పించారు.