Home » Yogi Adityanath
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ( Mamata Banerjee ) ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రామనవమి వేడుకల సందర్భంగా బెంగాల్ లోని ముర్షిదాబాద్ లో జరిగిన హింసపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) మరోసారి రానున్నారు. ఈనెల 20న శనివారం చిక్కబళ్ళాపుర, బెంగళూరు(Chikkaballapura, Bangalore)లలో అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు.
శారదీయ నవరాత్రి 'మహర్నవమి' పర్వదినం సందర్భంగా ఏటా సంప్రదాయబద్ధంగా చేసే 'కన్యాపూజ'ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గోరఖ్నాథ్ ఆలయంలో నవరాత్రి తొమ్మిదో రోజు సందర్భంగా నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో తొమ్మిది మంది చిన్నారులకు కాళ్లు కడిగి వారికి తిలకం దిద్దారు.
సమాజానికి ముప్పు తెచ్చే నేరస్థులకు 'రామ్ నామ్ సత్య్ హై' (అంత్యక్రియలు) ఖాయమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. మనిషి మృతదేహానని మోసేటప్పుడు వెంట వెళ్లేవారు 'రామ్ నామ్ సత్య్ హై' అంటూ నినదించడం అనేది హిందూ మత విశ్వాసాల్లో ఒకటిగా ఉంది.
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ (Mukthar Ansari) సోదరుడు, ఘాజీపూర్ ఎంపీ అప్జల్ అన్సారీ ఆయన అన్న మృతిపై సంచలన ప్రకటన చేశారు. ముఖ్తార్ అన్సారీ కథ సుఖాంతమైందని ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం ఆలోచిస్తోందని అఫ్జల్ పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీకి బీజేపీ (BJP) ఈ ఎన్నికల్లో టికెట్ నిరాకరించింది. ఈ స్థానం నుంచి ఉత్తరప్రదేశ్ మంత్రి జితిన్ ప్రసాద్ను అభ్యర్థిగా ప్రకటించింది. దీనిపై వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీ (Maneka Gandhi) తొలిసారి స్పందించారు.
ఉత్తర్ ప్రదేశ్(uttar pradesh)లో కరుడుగట్టిన మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ(mukhtar ansari) గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. ఇవాళ ఆయన స్వగ్రామమైన యూపీలోని ఘాజీపూర్(ghazipur)లో కట్టుదిట్టమైన భద్రత మధ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన భౌతికకాయాన్ని శనివారం ఉదయం ఘాజీపూర్కు తరలించారు.
రాజ్యాంగం(constitution) కంటే షరియత్(Shariat law) పెద్దది కాదని ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(yogi adityanath) వ్యాఖ్యానించారు. ఈ దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుందని గుర్తు చేశారు. ముస్లింలు దేశంలో(india) ఇళ్లు సహా అనేక పథకాలను పొందుతున్నారని పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్లో లోక్సభ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రంలో పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారానికి ఆయన సారథ్యం వహించనున్నారు. హోలీ వేడుకలు ముగిసిన వెంటనే మధుర నుంచి ప్రచారం ప్రారంభించి, పార్టీ శ్రేణులను ఉత్తేజపరచనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీడియో ఒక్కటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో ఫేక్ అని పోలీసులు తేల్చారు. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ సాయంతో కొందరు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఘటనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. గ్రేస్ గార్సియా ఫేస్ బుక్ ప్రొఫైల్లో వీడియోను పోస్ట్ చేశారని గుర్తించారు.