Home » Yogi Adityanath
లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల మోసపూరిత మాటలను ప్రజలు నమ్మారని అందుకే లోక్ సభ ఫలితాల్లో బీజేపీ వెనకబడిందని యూపీ(Uttar Pradesh) సీఎం యోగీ ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) పేర్కొన్నారు. యూపీలో ఆదివారం జరిగిన బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం దేశంలో హైబ్రిడ్ వాహనాలకు(hybrid vehicles) డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇవి పెట్రోల్ లేదా డీజిల్తోపాటు బ్యాటరీ ఆధారంగా పనిచేయడం వీటి ప్రత్యేకత. ఎంతేకాదు ఈ వాహనాలకు మైలేజ్ ఎక్కువ, కాలుష్యం తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఉత్తర్ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఇలాంటి వాహనాలు తీసుకున్న వారికి పన్ను మినహయింపులను ప్రకటించింది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైబ్రిడ్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజుపై వందశాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో కొనుగోలు దారులకు మేలు జరగనుంది.
కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టారు. 370 సీట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకున్న బీజేపీ 240 సీట్లతోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ (Hathras) జిల్లా పుల్రయీ గ్రామంలో జరిగిన సత్సంగ్ తొక్కిసలాటలో 121మంది మృతికి కారణమైన సంఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.
దైవ భక్తితో నాలుగు మంచి మాటలు విందామని ప్రవచనానికి వెళ్తే.
ధార్మిక సంబంధమైన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన నేపపథ్యంలో హత్రాస్ జిల్లాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారంనాడు పర్యటించారు. ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా? ఇందులో కుట్ర కోణం ఉందా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశాలిచ్చారు.
ఉత్తర్ప్రదేశ్(Uttar Pradesh)లోని హత్రాస్(Hathras)లో మంగళవారం ఘోర ప్రమాదం జరుగగా, ప్రమాదంలో ఇప్పటివరకు 121 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ బృందం(Forensic team) బుధవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టింది. డాగ్ స్క్వాడ్తో ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు.
హిందువులుగా చెప్పుకునే వారు హింసను, ద్వేషాన్ని, అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ లోక్సభలో చేసిన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘాటుగా స్పందించారు. రాహుల్ అపరిపక్వ నేత అని అభివర్ణించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా అయోధ్యలో పలు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోవడంతోపాటు రహదారులపై భారీ గుంతులు ఏర్పాడ్డాయి. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.