Home » yoga meditation
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day 2024) ప్రపంచ దేశాలన్నీ ఘనంగా జరుపుకుంటున్నాయి. భారత్లో శుక్రవారం ఉదయం నుంచే అనేక ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు యోగాసనాలు వేశారు.
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day 2024) దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) శ్రీనగర్(Srinagar)లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారత సరిహద్దుల్లో మంచుతో ఉన్న ఎత్తైన శిఖరాల మధ్య ఆర్మీ సైనికులు నేడు యోగా డే సందర్భంగా యోగా సాధన చేశారు. అంతేకాదు మంచు మధ్య యోగా చేస్తూ సూర్య నమస్కారాలతో ఫిట్గా ఉండాలనే సందేశాన్ని కూడా సైనికులు ప్రజలకు అందించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రతి ఏటా జూన్ 21న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. యోగా ప్రాముఖ్యత, దాని ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే ఈ దినోత్సవాన్ని ఎప్పటి నుంచి జరుపుతున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
“అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని“ వేడుకగా జరుపుకోవడమనేది ప్రపంచ క్యాలెండర్లో ఒక భాగం. దీని అసలైన ప్రాముఖ్యం మన ఆత్మల లోపల ఉంది. ‘యోగా’ లేక ‘యోగ్’ అంటే ‘ఈశ్వరుడితో కలయిక ‘అని భావార్థం.
ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 20, 21 తేదీల్లో జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. జూన్ 20న సాయంత్రం 6 గంటలకు శ్రీనగర్లోని షేర్-ఐ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (SKICC)లో 'ఎంపవరింగ్ యూత్, ట్రాన్స్ఫార్మింగ్ J&K' కార్యక్రమంలో భాగస్వామి అవుతారు.
ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ అధికారాన్ని అందుకున్నారు. ఆ క్రమంలో త్వరలో జమ్ము కాశ్మీర్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ నేపథ్యంలో శ్రీనగర్లోని దాల్ సరస్సు సమీపంలోని షేర్ ఐ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ వేదికగా జరిగే యోగా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనున్నారు.
యోగా చేస్తే శారీరకంగా, మానసికంగా బాగుంటారు. ఇదే విషయాన్ని వైద్యులు చెబుతుంటారు. వయస్సుతో సంబంధం లేకుండా యోగా చేస్తుంటారు. 60 లేదా 70 ఏళ్ల వృద్దులు యోగా చేయడం అంటే కష్టం.. మరి వందేళ్లు దాటితే అసాధ్యం.. స్వామి శివానందకు సాధ్యం అవుతోంది.
. యోగ చేయడం వల్ల శారీరక శ్రమతోపాటు మానసికంగా బాగుంటారని వివరిస్తున్నారు. యోగాలో చాలా ఆసనాలు ఉంటాయి. అందులో తాడాసనానికి ప్రాధాన్యం ఉంది.