• Home » Yadadri Temple

Yadadri Temple

Yadagirigutta: యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ

Yadagirigutta: యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారిని దర్శించుకోడానికి ప్రముఖులు, భక్త జనం పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. లక్ష్మీనరసింహ స్వామి ధర్మ దర్శనానికి సుమారు 2 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది.

Yadagirigutta: భక్తజనసంద్రంగా యాదగిరిగుట్ట

Yadagirigutta: భక్తజనసంద్రంగా యాదగిరిగుట్ట

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆషాఢమాసం అయినప్పటికీ సెలవు రోజు కావడంతో సుమారు 30 వేల మంది భక్తులు రాగా.. ప్రత్యేక, ధర్మ దర్శన క్యూలైన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది.

CM Revanth Reddy: యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు

CM Revanth Reddy: యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ (శుక్రవారం) యాదాద్రికి చేరుకున్నారు. యాదగిరి గుట్ట ప్రధాన దేవాలయానికి చేరుకున్న సీఎం... యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆపై ఆఖండ దీపారాదన చేశారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, విప్ బీర్ల ఐలయ్య ఉన్నారు.

Telangana: తోపులాటలో ఇరుక్కుపోయిన తెలంగాణ మంత్రి

Telangana: తోపులాటలో ఇరుక్కుపోయిన తెలంగాణ మంత్రి

Telangana: రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తోపులాటలో చిక్కుకుపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, అధికారులు ఉన్నప్పటికీ మంత్రి తోపులాటలో ఇరుక్కుపోవడం చర్చనీయాంశంగా మారింది.

CM Revanth Reddy: నేడే ఆ పాదయాత్ర ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy: నేడే ఆ పాదయాత్ర ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..

శుక్రవారం మధ్యాహ్నాం 1:30లకు రోడ్డుమార్గాన వలిగొండ మండలం సంగెంకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. సంగెం నుంచి మూసీ నది పునరుజ్జీవ సంకల్ప పాదయాత్రను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.

MLA Kaushik Reddy: గుట్టపై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి రీల్స్‌ చిత్రీకరణ

MLA Kaushik Reddy: గుట్టపై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి రీల్స్‌ చిత్రీకరణ

తెలంగాణ ఇలవేల్పుగా వెలుగొందుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి రీల్స్‌ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Yadagirigutta: గోపురం స్వర్ణ తాపడానికి విరాళాలివ్వండి

Yadagirigutta: గోపురం స్వర్ణ తాపడానికి విరాళాలివ్వండి

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్య విమాన రాజగోపురం స్వర్ణ తాపడానికి విరాళాలు ఇవ్వాలని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కోరారు.

Kishan Reddy: రూ.20తో గంటలో యాదగిరి గుట్టకు.. ఎంఎంటీఎస్ సేవలపై కిషన్ రెడ్డి ప్రకటన

Kishan Reddy: రూ.20తో గంటలో యాదగిరి గుట్టకు.. ఎంఎంటీఎస్ సేవలపై కిషన్ రెడ్డి ప్రకటన

భాగ్యనగర వాసులకు అత్యంత చేరువలో ఉన్న అతి పెద్ద దేవాలయం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం. నగరానికి 60 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయానికి వెళ్లాలంటే రోడ్డు మార్గం ఒక్కటే అందుబాటులో ఉంది. అయితే యాదాద్రికి వెళ్లాలనుకుంటున్న భక్తులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం శుభవార్త తెలిపారు.

Yadagirigutta: దసరా నుంచి స్వర్ణతాపడం పనులు

Yadagirigutta: దసరా నుంచి స్వర్ణతాపడం పనులు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్య విమాన రాజగోపురానికి బంగారు తాపడం పనుల కోసం 11.700 కిలోల బంగారాన్ని ఈవో భాస్కర్‌రావు గురువారం స్మార్ట్‌ క్రియేషన్స్‌ సంస్థకు చెన్నైలో అప్పగించారు.

Yadagirigutta: గుట్ట మీద భక్తులకు 200 గదులు!

Yadagirigutta: గుట్ట మీద భక్తులకు 200 గదులు!

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వస్తున్న భక్తులకు గుట్ట మీద.. వసతి పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండటంతో కొత్తగా 200 గదులను నిర్మించాలన్న ప్రతిపాదన ముందుకొచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి