Home » Womens Reservation Bill
భారత ప్రజాస్వామ్యానికి ఏప్రిల్ 17 చీకటి రోజని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి తల్లి, అక్కా, చెల్లి, కుమార్తెకు ఈరోజు అవమాన దినమని పేర్కొన్నారు.
లోక్సభలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. విపక్ష నేతలందరూ ఏకమై ఒక ‘జాతీయ విపత్తును’ నివారించారని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఉత్కంఠ భరితంగా జరిగిన ఓటింగ్లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 మంది ఓటు వేశారు.
కేంద్ర క్యాబినెట్ అత్యవసర భేటీ కానుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం ఉదయం 11:30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
డీలిమిటేషన్ ప్రధాన ఉద్దేశాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా లోక్సభకు వివరించారు. ప్రస్తుత లోక్సభ నియోజకవర్గాల జనాభాలో భారీ వ్యత్యాసం ఉందని చెప్పారు. ఆ కారణంగా ఒక్కో ఎంపీ లక్షలాది మంది ఓటర్ల సమస్యలను వినడటం కష్టంగా మారిందన్నారు.
నారీ శక్తీ వందనం బిల్లుపై పార్లమెంట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అత్యంత బాధ్యత రహితంగా మాట్లాడారని ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సాధికారిత బిల్లుపై, మహిళల అభివృద్ధి గురించి మాట్లాడమంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అవహేళనగా మాట్లాడారని ధ్వజమెత్తారు.
లోక్సభలో మూడు బిల్లులపై కీలకమైన ఓటింగ్ జరుగనుండటంతో ఉత్కంఠ నెలకొంది. ఓటింగ్ మరి కాసేపట్లో ఉందనగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు.
మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజనపై జరిగిన చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని 'మెజిషియన్'గా రాహుల్ గాంధీ సంబోధించారు. దీనిపై లోక్సభలో బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.
భారత నారీ శక్తికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగ లేఖ రాశారు. దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ల కలను సాకారం చేశామని ప్రధాని ప్రకటించారు.