Home » West Bengal
కోల్కతాలోని ప్రఖ్యాత సాల్ట్ లేక్ స్డేడియం వీవీఐపీ గేటు వెలుపలనున్న వివాదాస్పద ఫుట్బాల్ శిల్పాన్ని శనివారం ఉదయం కూల్చివేశారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫుట్బాల్ శిల్పం కూల్చివేత జరిగినట్టు అధికారులు తెలిపారు.
ప్రధానమంత్రి మోదీ బెంగాల్ పర్యటనలో ఆయనకు ఝల్మురి అమ్మిన విక్రమ్ సావోకు తాజాగా అజ్ఞాత వ్యక్తుల నుంచి బెదరింపులు వస్తున్నాయి. తనను చంపుతామంటూ బెదిరింపులు వచ్చినట్టు విక్రమ్ సావో శనివారంనాడు తెలిపారు.
పశ్చిమ బెంగాల్లో అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన 2024 నాటి ‘ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్’ మెడికోపై అత్యాచారం, హత్య కేసు దర్యాప్తు తీరుపై కలకత్తా హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు విచారణ పురోగతిపై CBIను నిలదీస్తూ ప్రత్యేక సిట్ కు ఉత్తర్వులిచ్చింది.
మరో రెండ్రోజుల్లో ఫల్తా నియోజకవర్గం ఉప ఎన్నిక జరుగనున్న తరుణంలో టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ తన నామినేషన్ను మంగళవారంనాడు ఉపసంహరించుకోవడం సంచలనమైంది. దీనిపై టీఎంసీ తీవ్ర స్థాయిలో బీజేపీపై విరుచుకుపడింది. బీజేపీ ఒత్తిడి రాజకీయాలే ఇందుకు కారణమని మండిపడింది.
పశ్చిమ బెంగాల్లోని ఫల్తా నియోజకవర్గ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జహంగీర్ ఖాన్.. పార్టీ అధినేత మమతా బెనర్జీకి షాక్ ఇచ్చారు. మే 21న జరగనున్న రీపోలింగ్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చంద్రనాథ్ను కాల్చిచంపిన షూటర్ రాజ్కుమార్ను ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో సీబీఐ సోమవారంనాడు అరెస్టు చేసింది.
పశ్చిమ బెంగాల్లో ఇటీవల అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు సిద్ధమవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై నిర్ణయం తీసుకుంది. కోల్కతాలో సోమవారం సీఎం సువేందు అధికారి ఆధ్వర్యంలో రెండోసారి క్యాబినెట్ భేటీ జరిగింది.
గోవుల అక్రమ రవాణాపై బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సారథ్యంలోని ప్రభుత్వం కొరఢా ఝలిపించింది. ఈ నేపథ్యంలో పశువులను తరలిస్తున్న ఒక వాహనాన్ని బీజేపీకి కొత్తగా ఎన్నికైన మహిళా ఎమ్మెల్యే రేఖా పాత్ర అడ్డుకున్నారు. కబేళాకు తరలించాలంటే ఆవుల బర్త్ సర్టిఫికెట్ చూపించాల్సిందేనని పట్టుపట్టారు.
తృణమూల్ కాంగ్రెస్ నేత జహంగీర్ ఖాన్కు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి గట్టి హెచ్చరిక చేశారు. ఆయనను 'పేరుమోసిన క్రిమినల్'గా అభివరిస్తూ, ఖాన్కు చెందిన కేసులను తాను వ్యక్తిగతంగా హ్యాండిల్ చేస్తానని అన్నారు.