Home » West Bengal
మమతాబెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సోమవారంనాడు ఇద్దరు ఎమ్మెల్యేలపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. పార్టీ ఎమ్మెల్యేలు సందీపన్ సహా, రితబ్రత బెనర్జీలను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది.
పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించింది. ఈ రోజు (సోమవారం) 35మంది బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కేబినెట్ను విస్తరించనుంది. ఈరోజు (సోమవారం) సుమారు 35 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కోల్కతాలోని లోక్ భవన్లో గవర్నర్ ఆర్.ఎన్.రవి కొత్త మంత్రులతో ప్రమాణం చేయించనున్నారు.
పశ్చిమ బెంగాల్లోని సౌత్ 24 పరగణాల జిల్లా మధురాపూర్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బాపీ హల్దార్ పార్టీ కార్యాలయంపై స్థానికులు ఆదివారంనాడు దాడి చేశారు. కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. వరద సహాయక సామగ్రిని అక్రమంగా పార్టీ కార్యాలయంలో దాచిపెట్టారని ఆరోపిస్తూ గ్రామస్థులు ఈ దాడి జరిపినట్టు పోలీసులు తెలిపారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీపై దాడులు ఇప్పటికే సంచలనం సృష్టించగా, తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఖోకన్ దాస్ను ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో పోలీసులు అరెస్టు చేశారు.
కీలకమైన మంత్రివర్గ విస్తరణను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం చేపట్టనుంది. కొత్తగా 35 మందిని మంత్రివర్గంలో తీసుకోనున్నట్టు ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆదివారంనాడు ప్రకటించారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై సోనార్పూర్లో జరిగిన దాడి తీవ్ర సంచలనమవుతోంది. బీజేపీ నేతలే తనను చంపేందుకు కుట్రపూరితంగా దాడి చేశారని అభిషేక్ బెనర్జీ చేసిన ఆరోపణలను తాజాగా బీజేపీ ఖండించింది. టీఎంసీలో అంతర్గత విభేదాలే దాడికి కారణంగా కనిపిస్తోందని పేర్కొంది.
సోనార్పూర్లో తనపై జరిగిన దాడిని టీఎంసీ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఖండించారు. తనపై జరిగిన దాడిని రాజకీయ హింసగా అభివర్ణించారాయన.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి జరిగింది. చందితల పోలీస్ స్టేషన్ బయట ఆయనపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు.
పశ్చిమ బెంగాల్లోని సోనార్పూర్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై శనివారం దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఐదుగురు నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు.