Home » West Bengal
ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాలు 'మరమరాల మిక్చర్' ప్రధానాంశంగా నడుస్తున్నాయి. మోదీ, మమతా బెనర్జీ మధ్య ఒకప్పుడు కేవలం ఆహారం, ఆరోగ్యం గురించి ఇదే మిక్చర్ మీద జరిగిన చర్చ, ఇప్పుడు ఇద్దరు అగ్రనేతల మధ్య ప్రధాన విమర్శనాస్త్రంగా మారింది.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తన సొంత నియోజవర్గమైన భవానీపూర్లో ఆదివారంనాడు పాదయాత్ర జరిపారు. స్థానికులను కలుస్తూ ముందుకు కదిలారు. ఈ పాదయాత్రలో వేలాది మంది మద్దతుదారులు పాల్గొన్నారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. టీఎంసీ ఎన్నికల ప్రచారానికి మద్దతుగా బేలేఘాటాలో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల సభలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని 'బలహీన ప్రధాని'గా అభివర్ణించారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంటోంది. రెండో విడత పోలింగ్కు సోమవారంతో ప్రచారం ముగియనుండటంతో ప్రధాన పార్టీలన్నీ బహిరంగ సభలు, రోడ్షోలతో ఊదరగొడుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు వరుస బహిరంగ సభలు, రోడ్షోలతో ప్రచారం సాగించారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి అనుకూల పవనాలు వీస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తొలి విడత పోలింగ్లో భారీ ఓటింగ్తో టీఎంసీకి గట్టి దెబ్బ తగిలిందని, తుది విడత ముగిసేసరికి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.
పశ్చిమబెంగాల్లో కీలకమైన రెండో విడత పోలింగ్కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌత్ 24 పరగణాల జిల్లాలోని భాంగర్లోని ఓ ఇంటి నుంచి సుమారు 100 నాటు బాంబులను పోలీసులు ఆదివారంనాడు స్వాధీనం చేసుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇద్దరూ అధికారం కోసం ఆరాటపడుతూ పేదలను పట్టించుకోరని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దేశ సంపదను ధనికులకు దోచుపెడుతున్నారంటూ విమర్శించారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రచారంలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా చేసిన హింసాత్మక వ్యాఖ్యలపై లీగల్ కేసు వేయనున్నట్టు పశ్చిమబెంగాల్ మమతా బెనర్జీ తెలిపారు.
పశ్చిమబెంగాల్లో రెండో విడత ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కుతోంది. రాష్ట్రం నుంచి గూండాలను ఏరివేసేందుకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కట్టుబడి ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు అస్సాంకు కూడా కీలకమని, బంగ్లాదేశీయుల అక్రమ వలసల వల్ల హిందువులు త్వరలోనే మెజారిటీ కోల్పోనున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. బెంగాల్లో జరిగిన మొదటి విడత పోలింగ్లో బీజేపీకి వచ్చిన సపోర్ట్ చూస్తే 200కు పైగా సీట్లు గెలుచుకున్నా ఆశ్చర్యపడాల్సిన పనిలేదన్నారు.