Home » West Bengal
కోల్కతాలోని ఒక ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం రాత్రి నాలుగు గంటల సేపు ఉండటం, తెల్లవారుజామున 12.07 గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోవడంపై ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలకు మందు ఎలాంటి అవకతవకలు జరగకుండా ఆమె కదలికలపై తాము నిఘా ఉంచినట్టు చెప్పారు.
భవానీపూర్లో పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సౌత్ కోల్కతాలోని స్ట్రాంగ్ రూమ్కు వెళ్లడం, బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో తలెత్తిన హైడ్రామాపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ టీఎంసీ చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని పోలింగ్ ఏజెన్సీ టుడేస్ చాణక్య వెల్లడించింది. మెుత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 192 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటుందని తెలిపింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ వీడియో సందేశం పోస్టు చేశారు.
బెంగాల్లో చాణక్య స్ట్రాటజీస్, మ్యాట్రిజ్, ప్రజాపోల్, పోల్ డైరీ వంటి ఎగ్జిట్పోల్స్ బీజేపీకి పట్టం కట్టాయి. పీపుల్స్ పల్స్, జన్మత్ పోల్స్ టీఎంసీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పాయి.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ముగిసింది. 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. అయితే 6 గంటల లోపు క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఈసీ కల్పించడంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. కాగా, టీఎంసీ గెలుపుపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు.
బెంగాల్ ప్రతిపక్ష నేత, భవానీపూర్ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఎన్నికల ఏర్పాట్లు తనిఖీ చేసేందుకు బుధవారం ఒక పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నప్పుడు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీఎంసీ మద్దతుదారులు అక్కడకు చేరుకుని 'జై బెంగాల్' నినాదాలు చేశారు.
తుది దశ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, లోక్సభ ఎంపీ అభిషేక్ బెనర్జీకి బలమైన పట్టున్న ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాలలో అక్రమాలు జరుగుతున్నాయి అంటోంది.
పశ్చిమ బెంగాల్లో ఇవాళ రెండో విడత పోలింగ్ జరుగుతోంది. 142 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఇదే సమయంలో టీఎంసీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
పశ్చిమ బెంగాల్లో తుది దశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఉద్రిక్తత నెలకొంది. హౌరా జిల్లాలోని బాల్లి ప్రాంతంలో ఈవీఎంలో లోపం తలెత్తింది. ఈ కారణంగా అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికంగా చిన్నపాటి గొడవ చెలరేగినట్లు తెలుస్తోంది.