Home » West Bengal
పశ్చిమబెంగాల్ బీజేపీ శానససభాపక్ష నేతగా సువేందు అధికారిని కేంద్రం హోం మంత్రి అమిత్షా శుక్రవారంనాడు ప్రకటించారు. 'కాబోయే సీఎం'గా సువేందును అభివర్ణించారు. సోనార్ బంగ్లా కలల సాకారానికి కొత్త ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు.
బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. కోల్కతాలో అమిత్షా సమక్షంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. రాష్ట్రంలో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పగ్గాలు చేపట్టనున్నారు. కోల్కతాలోని బిశ్వ బంగ్లా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సువేందు అధికారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
పశ్చిమ బెంగాల్ సీఎంగా బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
పశ్చిమ బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశానికి నేటితో తెరపడనుంది. సీఎం అభ్యర్థిని బీజేపీ ఎమ్మెల్యేలు ఈరోజు (శుక్రవారం) ఎన్నుకోనున్నారు. ఇందు కోసం కోల్కతాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్తున్నారు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని మమతా ఆరోపిస్తూ పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరిస్తున్నారు. దీనిపై రాజ్యాంగం ఏం చెబుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం..
గురువారం న్యూఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మీటింగ్కు మహువా మొయిత్రా ఢిల్లీ బయలుదేరారు. ఇండిగో విమానంలో ఆమె ఢిల్లీకి వెళుతుండగా.. కొంతమంది ప్రయాణికులు ఆమెతో తప్పుగా ప్రవర్తించారు. టీఎంసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కోల్కతా పర్యటనకు వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్లో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు.
తాను మమతా బెనర్జీని ఎన్నికల్లో ఓడించినందుకే తన పీఏ హత్య జరిగిందని బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి మండిపడ్డారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి గురువారం రద్దు చేశారు. ముఖ్యమంత్రి పదవికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో.. గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.