Home » Warangal
Miss World Contestants: అందాల భామలు బుధవారం వరంగల్, ములుగు జిల్లాలో పలు దర్శనీయ ప్రాంతాలను సందర్శించనున్నారు. 35 మందితో కూడిన సుందరీమణులతో కూడిన ఒక బృందం వరంగల్ నగరంలోని వేయిస్తంభాల ఆలయ నిర్మాణం, శిల్ప వైభవాన్ని, వరంగల్ కోటలో కాకతీయుల కీర్తి తోరణంతో పాటు శిల్పసంపదను పరిశీలిస్తుంది. అలాగే..
Operation Sindoor: కర్రెగుట్టల్లో మావోయిస్టుల వేటకు కాస్త విరామం పడింది. ఆపరేషన్ కగార్పై ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ పడింది. వెంటనే బార్డర్కు వెళ్లాల్సిందిగా సీఆర్పీఎఫ్ బలగాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుత వేసవి సెలవుల రద్దీ నేపధ్యంలో ఈనెల 12వతేదీ నుంచి చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 26 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రైళ్లలో కొన్ని నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా, మరికొన్ని ఖాజీపేట్, వరంగల్, ఖమ్మం మీదుగా నడుస్తాయని రైల్వేశాఖ తెలిపింది.
Maoists: తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నక్సల్స్ తూటాలకు బలైన పోలీసుల అంత్యక్రియలకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్, గ్రేహౌండ్స్ డీజీ స్టీఫెన్ రవీంద్ర, ఇతర పోలీసు అధికారులు హాజరయ్యారు.
వెండి, బుల్లితెర కళాకారుడు గుడిబోయిన బాబు తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు అనారోగ్యంతో మంచంపట్టారు. వైద్యం, మందుల కొనుగోలుకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు, వరంగల్ రంగస్థల కళాకారుల సంఘం ప్రతినిధులు తెలిపారు.
Seethakka On Operation Kagar: ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలని మంత్రి సీతక్క సూచించారు. బల ప్రయోగంతో కాకుండా, చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఆదివాసి బిడ్డగా కోరుకుంటున్నానని తెలిపారు.
ఒక్క భూమి ఇద్దరు రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి వచ్చిందని, ధరణి వచ్చిన తరువాత భూ సమస్యలు వచ్చాయని.. ఒకరి భూమి మరొకరికి వచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎమ్మార్వో లు పరిష్కారం చేసే పరిస్థితి లేదని.. ఆధార్ లాగ భూధార్ వచ్చిందన్నారు. భూమి రికార్డులు వెరిఫై చేసి ఎలాంటి వివాదాలు లేకుండా హక్కులు కల్పిస్తామని చెప్పారు.
తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్న తీరును చూస్తుంటే.. తనకు బాధ కలుగుతోందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఆగం చేస్తుంటే తన మనసు కాలుతోందని, దుఃఖం వస్తోందని తెలిపారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జనం ప్రవాహంలా తరలొచ్చారు. ఈ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు వివిధ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు సైకిళ్లు, ఎడ్లబండ్లు, వాహనాల్లోనే కాకుండా పాదయాత్రగానూ చేరుకున్నారు.
ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, అధికారం చేపట్టాక.. తెలంగాణ ప్రగతికోసం నిరంతరం పాటుపడుతూ.. బీఆర్ఎస్ 25 ఏళ్లు తన ప్రస్థానం సాగించిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.