• Home » Warangal News

Warangal News

TG Politics: కాంగ్రెస్‌లోకి వెళ్లడంపై కడియం శ్రీహరి కీలక ప్రకటన

TG Politics: కాంగ్రెస్‌లోకి వెళ్లడంపై కడియం శ్రీహరి కీలక ప్రకటన

బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి కాంగ్రెస్‌ (Congress) పార్టీలోకి వెళ్లడంపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) కీలక ప్రకటన చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ కార్యకర్తలతో కడియం శ్రీహరి శనివారం నాడు సమావేశం అయ్యారు.

 BREAKING: వరంగల్‌లో భారీ అగ్నిప్రమాదం

BREAKING: వరంగల్‌లో భారీ అగ్నిప్రమాదం

నగరంలోని పోచమ్మ మైదాన్ జకోటియా షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సెకండ్ ఫ్లోర్‌లో మంటలు ఎగసి పడుతున్నాయి. రెండు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. రెండు, మూడో ఫ్లోర్లకు మంటలు అంటుకున్నాయి. మంటలు ఆర్పేందుకు ఫైర్‌ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

MP Dayakar: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. రాజీనామా చేసిన కీలక నేత .. ఏ పార్టీలో చేరారంటే..?

MP Dayakar: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. రాజీనామా చేసిన కీలక నేత .. ఏ పార్టీలో చేరారంటే..?

పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌ (BRS)కు బిగ్ షాక్ తగిలింది. గులాబీ పార్టీకి ఇప్పటికే కీలక నేతలు రాజీనామా చేస్తున్నారు. బీఆర్ఎస్(BRS) నేతలు ఒక్కక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఇదే కోవలో బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ (MP Pasunoori Dayakar) బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి హై కమాండ్‌కు పంపించారు.

Telangana: ‘ఎందుకు ఆగం ఆగం అవుతున్నవ్’.. ఆరూరి రమేష్‌కు కేసీఆర్ హితబోధ..

Telangana: ‘ఎందుకు ఆగం ఆగం అవుతున్నవ్’.. ఆరూరి రమేష్‌కు కేసీఆర్ హితబోధ..

అధికారం కోల్పోయిన తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు(KCR) కొత్త కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా పార్టీని వీడిపోతున్న నేతలను కంట్రోల్ చేయడం గులాబీ దళపతికి ఇబ్బందిగా పరిణమిస్తోంది. పార్టీ మారుతారంటూ వార్త అందడమే ఆలస్యం.. ఆ నేతలను పిలిపించుకుని మాట్లాడుతున్నారు కేసీఆర్. తాజాగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌(Aroori Ramesh) బీఆర్ఎస్‌(BRS)ను వీడి.. బీజేపీ(BJP)లో చేరుతారంటూ వార్తలు వచ్చాయి.

TS NEWS: వరంగల్ జిల్లాలో విషాదం.. కరెంట్ షాకుతో ముగ్గురి మృతి

TS NEWS: వరంగల్ జిల్లాలో విషాదం.. కరెంట్ షాకుతో ముగ్గురి మృతి

జిల్లాలోని పర్వతగిరి మండలం మోత్య తండాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ ప్రమాదానికి గురై ముగ్గరు వ్యక్తులు మృతిచెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. రేపు(మంగళవారం) దుర్గమ్మ పండుగ నేపథ్యంలో విద్యుత్ తీగలను మండపానికి పెట్టే సమయంలో 33/11 కేవీ హెవీ లైన్ తెగి పడింది. ఈ ఘటనలో నలుగురు విద్యుత్ షాక్‌కు గురయ్యారు.

TS Politics: బీఆర్ఎస్‌కు భారీ షాక్.. ఆ కీలక నేత పార్టీమారనున్నారా..?

TS Politics: బీఆర్ఎస్‌కు భారీ షాక్.. ఆ కీలక నేత పార్టీమారనున్నారా..?

వరంగల్‌ జిల్లాలో గులాబీ పార్టీకి మరో భారీ షాక్ తలిగింది. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీకి, తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

TS NEWS: హనుమకొండ హరిత హోటల్లో అగ్ని ప్రమాదం.. ఈ ఘటనపై పలు అనుమానాలు

TS NEWS: హనుమకొండ హరిత హోటల్లో అగ్ని ప్రమాదం.. ఈ ఘటనపై పలు అనుమానాలు

నగరంలోని హరిత హోటల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కిచెన్‌లో అకస్మాత్తుగా మంటలు గా చెలరేగాయి.ఈ సంఘటనతో హోటల్ సిబ్బంది భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై మంటలను సిబ్బంది ఆర్పివేశారు. దాంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ అగ్నిప్రమాదంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Medaram Jatara-2024 Live Updates: జనసంద్రమైన మేడారం.. గద్దెపై కొలుదీరనున్న అమ్మవార్లు..

Medaram Jatara-2024 Live Updates: జనసంద్రమైన మేడారం.. గద్దెపై కొలుదీరనున్న అమ్మవార్లు..

Sammakka Saralamma Jatara 2024 Live Updates: ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం మహా జాతరకు దేశ వ్యాప్తంగా భక్తులు పోటెత్తారు. లక్షలాది మంది అమ్మవార్ల గద్దెలను దర్శించుకుంటున్నారు.

TS NEWS: హసన్ పర్తిలో చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

TS NEWS: హసన్ పర్తిలో చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

జిల్లాలోని హసన్ పర్తిలో ఆర్టీసీ బస్సు ఆదివారం నాడు చెట్టును ఢీకొంది. హసన్ పర్తి పెద్దచెరువు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్తుంది. ఈ బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.

Konda Surekha: ఎంజీఎం ప్రక్షాళనపై దృష్టి సారించాం

Konda Surekha: ఎంజీఎం ప్రక్షాళనపై దృష్టి సారించాం

జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రి ( MGM Hospital ) ప్రక్షాళనపై దృష్టి సారించామని మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ఎంజీఎంలో మంత్రి సురేఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంజీఎంలో వసతులు, రోగులకు అందుతున్న సేవలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ... కోతుల బెడద వల్ల వైర్లు తెగి షార్ట్ సర్క్యూట్ జరిగి ఎంజీఎంలో మొన్న రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని.. అధికారులు వెంటనే అప్రమత్తమై విద్యుత్ ను పునరుద్దరించారని మంత్రి కొండా సురేఖ చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి