Home » Vote
చిన్న చిన్న సంఘటనలు మినహా నియోజకవర్గంలో సోమవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గం వ్యాప్తంగా 241 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కును వినియోగిం చుకొనేందుకు బారులు తీరారు. ఉదయం పోలింగ్ మందకొడిగా సాగినా మధ్యా హ్నం నుంచి పుంజుకొంది. ఉదయం 9 గంటలకు 3.50 శాతం పోలింగ్ నమోదు కాగా 11 గంటలకు 29 శాతం, మధ్యాహ్నం 1 గంటకు 46.20 శాతం, మధ్యాహ్నం 3 గంటలకు 63.40 శాతం నమోదైంది. 4 గంటలకు 66.20 శాతం, సాయంత్రం 5 గంటలకు 71.25 శాతం, 6 గంటలకు 74.25 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
పెనుకొండ నియోజకవర్గంలో సాయంత్రం 6గంటలకు 78.77శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 23,5986మంది ఓటర్లు ఉండగా ఇందులో 117952 పురుషులు, 118030మహిళలు, నలుగురు ఇతరులు ఉన్నారు. సమయం 9గంటలు కావస్తున్నా ఓటర్లు బారులు తీరడంతో పోలింగ్శాతాన్ని ఎన్నికల అధికారులు ఇవ్వలేకపోయారు. డీఎస్పీ బాబాజానసైద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పర్యవేక్షించారు.
పెనుకొండ మండలం వెంకటరెడ్డిపల్లిలో సోమవారం ఉదయం 7గంటల కే ఓటర్లు బారులుతీరారు. అయితే గంటపాటు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఎన్నికల అధికారులకు పూర్తి అవగాహన లేకపోవడంతో ఆలస్యమైనట్లు తెలిసింది. నోడల్ అధికారి చొరవతో 7-58కి ప్రారంభమైంది. ఉక్కపోత అధికంగా ఉన్నా ఓటర్లు గంటలకొద్ది కూలో నిలబడి ఓటేసి వెళ్లారు. పెనుకొండ మండలంలో ఎన్నికల నిబంధనలను ఆయా పార్టీ నాయకులు ఉల్లంఘించడంతో చెదురుమదురు సంఘటనలు చోటుచేసుకున్నా యి.
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పట్టణంలోని ప్రతి కేంద్రం వ ద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం దాటిన క్యూ తగ్గలేదు. కొన్ని బూతలలో ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. ధర్మపురం 66వ పోలింగ్ బూతలో వైసీపీ ఏజంట్లు ఆలస్యంగా రావడంతో పోలింగ్ ఆ లస్యంగా రావడం, ఈవీఎం సరిగా పని చేయక పో వడంతో ఉదయం 7.26 పోలింగ్ ప్రారంభమైంది. ఆరు గంటల నుంచే క్యూలో నిలబడి న ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు.
టీడీపీ బలంగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో గొడవలు సృష్టించి పోలింగ్ శాతాన్ని తగ్గించేందుకు వైసీపీ కుట్ర పన్నిందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
వైసీపీ నాయకులు, కార్యకర్తలు అన్ని పోలింగ్ కేంద్రాల్లోకి చుట్టాళ్లా వెళ్లి వచ్చారు. దీంతో టీడీపీ నాయకులు అభ్యంతరం తెలిపారు. పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన వారు పట్టించుకోలేదు.
ఈ ఎన్నికలో తన విజయం, రాష్ట్రం లో పార్టీ విజయం ఏకపక్షమని ఉమ్మడి అ భ్యర్థి గుమ్మనూరు జ యరాం అన్నారు.
ఈవీఎంలు ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల ఓటర్లను ఇబ్బంది పెట్టినట్లేనని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. సోమవారం పోలింగ్ సందర్భంగా మండలంలోని దర్గాహోన్నూరు, గోవిందవాడ, బండూరు, ఉద్దేహాళ్, బొమ్మనహాళ్, నేమకల్లులలో పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల పోలింగ్ ముగిసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ ముగిసిందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో గల అరకు, రంపచోడవరం పాడేరు నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు వేసేందుకు వయోజనులు ఉదయమే పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ఎన్నికల సంఘం ప్రజలకు పిలుపునిచ్చింది. ఓటు హక్కు విధిగా ఉపయోగించుకోవాలని సెలబ్రిటీలు కోరారు.