Home » Vote
లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు చోట్ల విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. గుండెపోటుతో ఓ ఎన్నికల ఉద్యోగి, ఐదుగురు ఓటర్లు మృతి చెందారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలోని నెహ్రూనగర్ పోలింగ్ బూత్లో ఏపీవోగా విఽధులు నిర్వరిస్తున్న శ్రీకృష్ణ (55) గుండెపోటుతో కుప్పకూలాడు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో సీఎం రేవంత్రెడ్డి, భార్య గీతారెడ్డి, కుమార్తె నైనీశారెడ్డితో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నవారు హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు ఓట్లు వేసిన తర్వాత సోమవారం సాయంత్రం నుంచి హైదరాబాద్ బాట పట్టారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది.
మడకశిర మన్సిపాలిటీలోని నాలుగో వార్డులో ఉన్న చాలా మంది ఓటర్లకు పోలింగ్ కేంద్రం ఒక చోట, ఓటు మరోచోట ఉండడంతో ఓటువేయడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి ఓటరు స్లిప్పులో పోలింగ్ కేంద్రం ఎంఆర్ఎస్ స్కూల్ అనిఉంది. వాటితో ఉదయాన్నే ఎంఆర్ఎస్ స్కూల్ పోలింగ్ కేంద్రం (193) వద్దకు వెళ్లి గంటల కొద్ది క్యూలో ఉన్నారు. అయితే పీఓ మీ ఓటు ఉర్దూస్కూల్(185) పోలింగ్ కేం ద్రంలో ఉందని చెప్పి పంపారు.
చిన్న చిన్న సంఘటనలు మినహా నియోజకవర్గంలో సోమవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గం వ్యాప్తంగా 241 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కును వినియోగిం చుకొనేందుకు బారులు తీరారు. ఉదయం పోలింగ్ మందకొడిగా సాగినా మధ్యా హ్నం నుంచి పుంజుకొంది. ఉదయం 9 గంటలకు 3.50 శాతం పోలింగ్ నమోదు కాగా 11 గంటలకు 29 శాతం, మధ్యాహ్నం 1 గంటకు 46.20 శాతం, మధ్యాహ్నం 3 గంటలకు 63.40 శాతం నమోదైంది. 4 గంటలకు 66.20 శాతం, సాయంత్రం 5 గంటలకు 71.25 శాతం, 6 గంటలకు 74.25 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
పెనుకొండ నియోజకవర్గంలో సాయంత్రం 6గంటలకు 78.77శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 23,5986మంది ఓటర్లు ఉండగా ఇందులో 117952 పురుషులు, 118030మహిళలు, నలుగురు ఇతరులు ఉన్నారు. సమయం 9గంటలు కావస్తున్నా ఓటర్లు బారులు తీరడంతో పోలింగ్శాతాన్ని ఎన్నికల అధికారులు ఇవ్వలేకపోయారు. డీఎస్పీ బాబాజానసైద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పర్యవేక్షించారు.
పెనుకొండ మండలం వెంకటరెడ్డిపల్లిలో సోమవారం ఉదయం 7గంటల కే ఓటర్లు బారులుతీరారు. అయితే గంటపాటు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఎన్నికల అధికారులకు పూర్తి అవగాహన లేకపోవడంతో ఆలస్యమైనట్లు తెలిసింది. నోడల్ అధికారి చొరవతో 7-58కి ప్రారంభమైంది. ఉక్కపోత అధికంగా ఉన్నా ఓటర్లు గంటలకొద్ది కూలో నిలబడి ఓటేసి వెళ్లారు. పెనుకొండ మండలంలో ఎన్నికల నిబంధనలను ఆయా పార్టీ నాయకులు ఉల్లంఘించడంతో చెదురుమదురు సంఘటనలు చోటుచేసుకున్నా యి.
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పట్టణంలోని ప్రతి కేంద్రం వ ద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం దాటిన క్యూ తగ్గలేదు. కొన్ని బూతలలో ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. ధర్మపురం 66వ పోలింగ్ బూతలో వైసీపీ ఏజంట్లు ఆలస్యంగా రావడంతో పోలింగ్ ఆ లస్యంగా రావడం, ఈవీఎం సరిగా పని చేయక పో వడంతో ఉదయం 7.26 పోలింగ్ ప్రారంభమైంది. ఆరు గంటల నుంచే క్యూలో నిలబడి న ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు.
టీడీపీ బలంగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో గొడవలు సృష్టించి పోలింగ్ శాతాన్ని తగ్గించేందుకు వైసీపీ కుట్ర పన్నిందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
వైసీపీ నాయకులు, కార్యకర్తలు అన్ని పోలింగ్ కేంద్రాల్లోకి చుట్టాళ్లా వెళ్లి వచ్చారు. దీంతో టీడీపీ నాయకులు అభ్యంతరం తెలిపారు. పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన వారు పట్టించుకోలేదు.