Home » Vote
ఎన్నికల సమయం. ఓటు హక్కు ఉన్నవాళ్లంతా ఓట్లు వేసేందుకు పోలింగ్ రోజు బూత్లకు క్యూకడుతుంటారు. ఓట్ల పండుగ అంటే చెప్పేదేముంది.. అంతా హడావుడి.. రకరకాల జనం ఓటు కోసం వస్తుంటారు. ఓటు వేయడానికి ఎన్నికల సంఘం పలు నిబంధనలు రూపొందించింది. ఓటు వేసే సమయంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాల్సిందే. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయి.
ఓటు వేసేందుకే కాదు, ఐడీ ప్రూఫుల్లో ఒకటిగానూ ఓటర్ ఐడీ ఉపయోగపడుతుంది. అయితే దాన్ని అన్ని వేళలా జేబులో పెట్టుకుని తిరగడం సాధ్యం కాదు. అందుకే భారత ఎన్నికల సంఘం - డిజిటల్ ఓటర్ ఐడీ కార్డు దిశగా కృషి చేసింది. 2021లో నేషనల్ ఓటర్స్ రోజున డిజిటల్ ఓటర్ ఐడీ(Voter Id)లను అందించింది. అయితే ఇప్పుడు ఎడిట్ చేయడానికి వీలు లేని పీడీఎఫ్ ఫార్మేట్లో స్మార్ట్ఫోన్ లేదంటే కంప్యూటర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్ సభ ఎన్నికల కోసం కేసీఆర్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. గత నెల 24వ తేదీన మిర్యాలగూడ నుంచి బస్సుయాత్ర ప్రారంభించారు. 16 రోజుల పాటు 13 లోక్ సభ నియోజకవర్గాల్లో రోడ్ షో, కార్నర్ మీటింగ్ జరిగింది. ప్రచారానికి ఎన్నికల సంఘం బ్రేక్ ఇవ్వడంతో మే 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు బ్రేక్ పడింది. మిగతా అంతా షెడ్యూల్ ప్రచారం జరిగింది. అయినప్పటికీ కేసీఆర్ ప్రభావం అంతగా కనిపించడం లేదు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్కు మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఓ వైపు ఓటరు తీర్పు ఎలా ఉంటుందనే టెన్షన్ అభ్యర్థుల్లో ఉంటే.. గ్రామాల్లో మాత్రం ఓటుకు నోటు కోసం ఓటర్లు ఎదురుచూస్తున్నారట. ఇప్పటికే పంపకాలు ప్రారంభమైనట్లు సంకేతాలు రావడంతో గ్రామాల్లో ప్రజలు తమ ఇంటికి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారట. ఓటును నోటుతో కొనడం నేరం.. ఓటు కోసం డబ్బులివ్వడం, తీసుకోవడం రెండూ నేరమే. అయినా ప్రస్తుతం రాజకీయలు డబ్బు మయం కావడంతో.. ఓట్లకు డబ్బుల పంపిణీ సర్వసాధారణం అయిపోయింది.
లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మధ్యప్రదేశ్లోని బెరాసియాలో ఓ బాలుడు ఓటేసిన తాలుకు వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్గా మారింది.
ఓట్ల పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది పార్టీల ప్రచారం, రాజకీయ పార్టీల మధ్య విమర్శలు.. ఎక్కడ చూసినా పార్టీ జెండాలు.. పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్ది అభ్యర్థుల్లో టెన్షన్.. వీటన్నింటికి తోడు చివరి రెండు రోజులు అంటే పంపకాల సమయం.. ఇటీవల కాలంలో ఓటుకు నోట్ల పంపిణీ ఎక్కువైపోయింది. కావాలని ఓటర్లు అడగకపోయినా.. డబ్బులిస్తే ఓట్లు వేస్తారనే ఆశతో ప్రధాన పార్టీలు డబ్బుల పంపిణీకి శ్రీకారం చుడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఎలాగైనా సరే గెలవాలని చూస్తోంది. అందుకోసం అడ్డదారులను వెతుకుతుంది. తప్పుడు ఐడీల ద్వారా దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేస్తుంది. తిరుపతిలో ఫేక్ ఐడీలతో దొంగ ఓట్లు వేస్తారనే సమాచారం తమకు ఉందని జనసేన పార్టీ పరిశీలకుడు ఏఎం రత్నం వివరించారు.
ఎన్నికలు.. ఓటర్లు.. అనగానే పురుషులు ఎంతమంది!? మహిళలు ఎంతమంది అని చూస్తారు కానీ.. మొత్తం ఓటర్లలో యువత సగానికి సగం ఉన్నారని తెలుసా!?
దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను తొలగించి.. వాళ్లను బానిసలుగా మార్చే ప్రయత్నం బీజేపీ చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు.
దేశవ్యాప్తంగా మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. అహ్మదాబాద్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ప్రాధాన్యం ఉందన్నారు. అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.