Home » Vote
సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తుంటారు. పోలింగ్ జరిగే సమయంలో కొందరు అభ్యర్థులు టెన్షన్కు గురి అవుతుంటారు. స్వతంత్ర్య అభ్యర్థులను క్రాస్ ఓటింగ్ సమస్య వణికిస్తోంది. తమ లాంటి గుర్తు మరో అభ్యర్థికి కేటాయిస్తే ఓటరు కన్ఫ్యూజ్ అవుతారు. ఒకరికి వేసే ఓటు మరొకరి వేస్తారు. అలా ఎక్కువ మంది గందరగోళానికి గురయితే గెలిచే అభ్యర్థి ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి.
Andhrapradesh: ఎన్నికలకు, సంక్షేమ పథకాల పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పిస్తూ గతంలో ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయగా.. వేల సంఖ్యలో వాలంటీర్లు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాజీనామా చేసిన వాలంటీర్లతో వైసీపీ మరో పన్నాగానికి తెరతీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థి టెలికాన్ఫరెన్స్ చర్చనీయాంశంగా మారింది. ఓటర్లను తీసుకురావాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించాలంటూ కోరారు.
భవితకు దారి చూపించే ఓటు హక్కును వినియోగించుకోవడానికి జనం ఊరి బాట పడుతున్నారు. ప్రభుత్వాల ఏర్పాటులో భాగమయ్యేందుకు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బాధ్యతగా కదులుతున్నారు. విద్య, ఉపాధి, ఇతర అవసరాల కోసం ఏ ప్రాంతంలో ఉంటున్నా.. ఓటు వేసి.. ప్రజాస్వామాన్ని బలపరిచేందుకు సొంతూళ్లకు పయనమవుతున్నారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Election 2024) మే 13న పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్కు సంబంధించి ఎన్నికల కమిషన్ (Election Commission) శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం ఈరోజు(శనివారం) సాయంత్రం 6 గంటలకే ముగిసింది. ప్రచారం ముగిసిన కూడా ఓటర్లకు పలు రాజకీయ పార్టీల నుంచి బల్క్ ఎస్ఎంఎస్లు వస్తునే ఉన్నాయి. వీటిపై ఈసీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
Election Commission of India: ఓటు వేయడం ఓటరుగా(Voter) ప్రతి ఒక్కరి బాధ్యత. మీరు వేసే ఓటే దేశ, రాష్ట్ర భవిష్యత్ను నిర్ణయిస్తుంది. మంచి నాయకుడిని ఎన్నుకుని.. దేశ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేయండి. ప్రస్తుతం ఏపీ(Andhra Pradesh), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో కలిపి ..
పార్లమెంట్ ఎన్నికల (Lok Sabha Election 2024) కోసం కట్టదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశామని తెలంగాణ డీజీపీ రవిగుప్తా (DGP Ravi Gupta) తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడానికి పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను చేశామని చెప్పారు. శనివారం డీజీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
పోలింగ్ కేంద్రం వద్ద ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఒక రోజు ముందు నుంచే పోలీసు బలగాలు పోలింగ్ స్టేషన్లను తమ ఆధీనంలోకి తీసుకుంటాయి. ఈవీఎం తరలించినప్పటి నుంచి ఆ పరిసరాల్లోకి ఎవరిని రానీయరు. పోలింగ్ కేంద్రం నుంచి 200 మీటర్ల వరకు ముగ్గుతో గీస్తారు.
పోలింగ్ స్టేషన్ కనుగొనేందుకు ఈ కింది సూచనలు పాటించండి. ఇప్పుడు దాదాపు అంతా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ప్లే స్టోర్ నుంచి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్లో నో యువర్ పోలింగ్ స్టేషన్ విభాగంలో ఓటరు వివరాలను నమోదు చేయాలి. ఓటరు ఐడీ, పోలింగ్ కేంద్రం వివరాలు నమోదు చేస్తే ప్రస్తుత పోలింగ్ స్టేషన్ వివరాలు మీ మొబైల్ స్ర్కీన్ మీద కనబడతాయి. దానిని సేవ్ చేసుకొని, లేదంటే స్ర్కీన్ షాట్ తీసుకుంటే బెటర్. దాని ఆధారంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లొచ్చు.
Andhrapradesh: ఏపీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు విదేశాల నుంచి తెలుగు వారు తరలివస్తున్నారు. మేము సైతం అంటూ వివిధ దేశాల్లో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలు ఏపీకి చేరుకుంటున్నారు. షార్జా నుంచి 100 మంది ప్రవాసాంధ్రులు ఓటు వేసేందుకు ఆంధ్రాకు వచ్చారు. షార్జా, దుబాయ్ పలు ప్రదేశాల నుంచి ఓటు వేసేందుకు గన్నవరం ఎయిర్ట్కు ప్రవాసాంధ్రులు చేరుకున్నారు.
దేశవ్యాప్తంగా 2024 లోక్సభ ఎన్నికలు(2024 Lok Sabha elections) ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమయ్యాయి. మే 13న నాలుగో విడత పోలింగ్ జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని ప్రతి పౌరులు తమ రాజ్యాంగ హక్కు ప్రకారం ఓటు వేయాలి. కానీ ఓటరు జాబితాలో(voter list) మీ పేరు ఉన్నప్పటికీ, మీకు ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే, మీరు ఇతర 12 ఐడీ కార్డులలో దేని సహాయంతోనైనా కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.