• Home » Vote

Vote

AP Elections: 7 గంటలకే ఓటు హక్కు వినియోగించుకోనున్న చంద్రబాబు

AP Elections: 7 గంటలకే ఓటు హక్కు వినియోగించుకోనున్న చంద్రబాబు

Andhrapradesh: రాష్ట్ర వ్యాప్తంగా మరికాసేపట్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభంకానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద మాక్ పోలింగ్ ప్రారంభమైంది. ఏజెంట్ల సమక్షంలో అధికారులు మాక్‌ పోలింగ్ నిర్వహించారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు.

ఓటెత్తి జైకొట్టు!

ఓటెత్తి జైకొట్టు!

ఐదేళ్ల పాలన చూశారు..! అంతకు మునుపు ఐదేళ్ల పాలనా చూశారు..! అరాచకాలకు, అభివృద్ధికి తేడాలను గమనించారు. మరో ఐదేళ్ల భవితకు పునాది వేసుకునేందుకు సిద్ధమయ్యారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో పోటెత్తి ఓటేసి.. స్పష్టమైన సంకేతాలను పంపించారు. ఈవీఎంల మీట నొక్కేందుకు మరింత ఉత్సాహంతో సిద్ధమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు విజేతగా నిలిచే సమయం ఆసన్నమైంది. అభ్యర్థుల భవితవ్యం అటుంచితే.. ప్రజాస్వామ్యాన్ని బతికించుకునే బాధ్యత ఓటరుదే. ‘తెల్లారింది లెగండోయ్‌.. కొక్కొరోక్కో..’ అంటూ.. ఓటేసేందుకు తాము వెళ్లడంతోపాటు.. ఇరుగూ పొరుగునూ తట్టిలేపి తీసుకెళ్లాలి. పోలింగ్‌ కేంద్రాలు కళకళలాడాలి. ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి. భవితను మార్చుకోవాలి. అభివృద్ధికి బాటలువేసేవారిని గురిచూసి ఎన్నుకోవాలి. ...

TDP: వసతుల ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం

TDP: వసతుల ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం

పోలింగ్‌ కేంద్రాల వద్ద కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. ఓటర్ల క్యూలైన్ల కోసం బారికేడ్ల ఏర్పాటు, నీడకోసం షామియానాల ఏర్పాటులో నిర్లక్ష్యం వహించారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ వినూత్న పోలింగ్‌ కేంద్రాల వద్ద వసతుల కల్పనపై పర్యవేక్షించడంతో లోపాలు బయటపడ్డాయి.

ELECTIONS: ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

ELECTIONS: ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జాయింట్‌ కలెక్టర్‌ కేతన గార్గ్‌ తెలిపారు. పట్టణంలోని జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో ఎన్నికల సిబ్బందికి అప్పగించే బాధ్యతలను రిటర్నింగ్‌ అధికారి, జేసీ ఆధ్వర్యంలో సమర్పించారు.

AP Election 2024: మీ ఓటు ఎవరైనా వేస్తే .. ఇలా చేయండి..  ఓటింగ్‌పై వర్లరామయ్య కీలక సూచనలు

AP Election 2024: మీ ఓటు ఎవరైనా వేస్తే .. ఇలా చేయండి.. ఓటింగ్‌పై వర్లరామయ్య కీలక సూచనలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. రేపు(సోమవారం) అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్‌లో మీ ఓటును మీరు కాకుండా ఇతరులు ఎవరైనా వేసినట్లు గుర్తిస్తే వెంటనే ఎన్నికల సంఘానికి (Electoral Commission) ఫిర్యాదు చేయండి. మీ ఓటుపై ఎలాంటి అనుమానాలు, సందేహాలు ఉన్నాఈసీకి తెలియజేయాలి. రేపు జరుగుతున్న పోలింగ్‌పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్లరామయ్య కీలక సూచనలు చేశారు.

Lok Sabha Election 2024: అక్రమంగా తరలిస్తున్న భారీ నగదు పట్టివేత

Lok Sabha Election 2024: అక్రమంగా తరలిస్తున్న భారీ నగదు పట్టివేత

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు (Lok Sabha Election 2024) మరికొన్ని గంటల సమయమే ఉంది. ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఎలాగైనా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తమ పార్టీలకు ఓట్లు మళ్లేలా ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల సంఘం (Election Commission) ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు నగరంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ. 2 కోట్ల నగదు పట్టుబడింది.

Elections 2024: ఓటరు స్లిప్పు లేదా.. ఈ సేవలు మీకోసమే..

Elections 2024: ఓటరు స్లిప్పు లేదా.. ఈ సేవలు మీకోసమే..

దేశంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటరు పేరు మీద ఎన్నికల సంఘం ఓటరు స్లిప్ ముద్రిస్తుంది. పోలింగ్ సమయానికి ఓ వారం రోజుల ముందే బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వో)లద్వారా ఓటర్లు స్లిప్‌లు పంపిణీ చేస్తారు. ఈ ఓటరు స్లిప్ ఉండటం ద్వారా ఓటరు ఏ బూత్‌లో ఓటు వేయాలో.. ఓటర్ల జాబితాలో క్రమ సంఖ్య ఎంత అనేది స్పష్టంగా ఉంటుంది. దీంతో పోలింగ్ స్పీడ్‌గా జరుగుతుంది.

Elections 2024: పోలింగ్ ఏజెంట్‌కు ఉండే హక్కులు ఏంటో తెలుసా..

Elections 2024: పోలింగ్ ఏజెంట్‌కు ఉండే హక్కులు ఏంటో తెలుసా..

ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఘట్టం పోలింగ్.. అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించేది పోలింగ్. ఎక్కువ మంది ఓటర్లు ఎవరికి ఓటు వేస్తే వాళ్లే ప్రజలను పాలించే పాలకులు అవుతారు. ఈ పోలింగ్ రోజున ఎక్కువుగా వినిపించే పదం పోలింగ్ ఏజెంట్.. సాధారణంగా ఎన్నికల సిబ్బంది ఉంటారు. అదే సమయంలో పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. ఈ ఇద్దరికీ ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమయ్యే అవకాశం ఉంటుంది. ఎన్నికల సిబ్బందిని ఎన్నికల సంఘం నియమిస్తుంది. వీరు ఎన్నికల సంఘం తరపున వారికి కేటాయించిన విధులు నిర్వర్తిస్తారు.

Loksabha Polls: తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవి గుప్త

Loksabha Polls: తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవి గుప్త

Telangana: తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ రవి గుప్త తెలిపారు. ఆదివారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో డీజీపీ రవి గుప్త మాట్లాడుతూ.. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినిగించుకోవాలని కోరారు. ఎక్కడా కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. 500 తెలంగాణ స్పెషల్‌ ఫోర్స్‌ విభాగాలు సహా.. 164 సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌తో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

AP Elections: విజయవాడ బస్టాండ్‌లో విపరీతమైన రద్దీ.. ఆర్టీసీపై ప్రయాణికుల ఫైర్

AP Elections: విజయవాడ బస్టాండ్‌లో విపరీతమైన రద్దీ.. ఆర్టీసీపై ప్రయాణికుల ఫైర్

Andhrapradesh: ఓటు వేసేందుకు వస్తున్న ప్రయాణికులతో విజయవాడ బస్టాండ్‌లో విపరీతమైన రద్దీ పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రయాణికులు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు బస్టాండ్‌లో నిరీక్షిస్తున్నారు. అయితే రద్దీకి సరిపడా బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేయని పరిస్థితి. విజయవాడ నుంచి గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరు తదితర ప్రాంతాలకు బస్సుల కొరత తీవ్రంగా ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి