• Home » Vote

Vote

Loksabha Polls: ఓటేసిన తెలంగాణ సీఎం రేవంత్

Loksabha Polls: ఓటేసిన తెలంగాణ సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించడం తప్ప పోలింగ్ కూల్‌గా సాగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రలో సతీ సమేతంగా ఓటు వేశారు.

Elections 2024: ప్రజాస్వామ్యం అంటే ఇదేరా.. సెలబ్రేటీల మొదలు సాధారణ మనిషి వరకు ఒకటే రూల్..

Elections 2024: ప్రజాస్వామ్యం అంటే ఇదేరా.. సెలబ్రేటీల మొదలు సాధారణ మనిషి వరకు ఒకటే రూల్..

ఎన్నికలంటే ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద పెండుగ. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు ద్వారా పాలకులను ఎన్నుకుంటారు. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు భారత్‌కు ఎంతో ప్రత్యేకం. ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఎలాంటి వ్యక్తి అయినా పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వెయ్యాలి. వయో వృద్ధులు, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది మాత్రం ముందుగానే పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటు వేయ్యొచ్చు.

Visakhapatnam: మమ్మల్ని పట్టించుకోండి.. ట్రైన్లో విశాఖ ఓటర్ల ఆవేదన

Visakhapatnam: మమ్మల్ని పట్టించుకోండి.. ట్రైన్లో విశాఖ ఓటర్ల ఆవేదన

Andhrapradesh: ఏపీలో జరుగుతున్న ఎన్నికలకు ఈసారి పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలివస్తున్నారు. ఎన్నికలు, పైగా వరుసగా సెలవులు రావడంతో తెలుగు ప్రజలు ఏపీ బాట పట్టారు. ఇప్పటికే చాలా మంది ప్రజలు తమ స్వంత గ్రామాలకు చేరుకోగా... చివరి గంటలో అయినా ఓటు హక్కు వినియోగించుకోవాలని భావించిన అనేక మంది ఈరోజు కూడా ఏపీకి పయనమయ్యారు. ఇదే విధంగా విశాఖకు చెందిన పలువురు ఓటర్లు ఓటు వేసేందుకు స్పెషల్ ట్రైన్‌లో బయలుదేరారు.

Elections 2024: ఓటరులో చైతన్యం నింపిన ఆంధ్రజ్యోతి.. పోలింగ్ కేంద్రాలకు క్యూ..

Elections 2024: ఓటరులో చైతన్యం నింపిన ఆంధ్రజ్యోతి.. పోలింగ్ కేంద్రాలకు క్యూ..

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశంలో నాలుగో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలతో పాటు తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు భారత ఎన్నికల సంఘం అనేక ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా ఏపీ, తెలంగాణలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఆంధ్రజ్యోతి తనవంతు ప్రయత్నం చేస్తూ వస్తుంది.

Pawan Kalyan: మంగళగిరిలో ఓటు వేసిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: మంగళగిరిలో ఓటు వేసిన పవన్ కళ్యాణ్

గుంటూరు జిల్లా: ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సోమవారం ఉదయం 7 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Loksabha Polls: పోలింగ్ బూత్ వద్ద డబ్బుల పంపిణీ

Loksabha Polls: పోలింగ్ బూత్ వద్ద డబ్బుల పంపిణీ

దేశవ్యాప్తంగా నాలుగో విడత లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గల 17 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మెదక్ లోక్ సభ సెగ్మెంట్‌లో గల పటాన్ చెరులో ఓ పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంపిణీ చేశారు.

Loksabha Polls: ఓటు హక్కు వినియోగించుకున్న మెగాస్టార్

Loksabha Polls: ఓటు హక్కు వినియోగించుకున్న మెగాస్టార్

Telangana: సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం భార్య, పెద్ద కూతురు సుష్మితతో కలిసి జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చిరు వచ్చారు. క్యూ లైన్లో వేచి ఉండి మరీ మెగాస్టార్ తన కుటుంబసభ్యులతో కలిసి ఓటేశారు. అనంతరం మీడియాతో చిరు మాట్లాడుతూ.. తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

AP Elections 2024: కర్నూల్‌లో ఇంకా ప్రారంభం కానీ పోలింగ్..జనాల ఆగ్రహం..

AP Elections 2024: కర్నూల్‌లో ఇంకా ప్రారంభం కానీ పోలింగ్..జనాల ఆగ్రహం..

ఏపీలో సార్వత్రిక ఎన్నికల (ap elections 2024)) పోలింగ్ ఉదయం 7 నుంచే మొదలు కాగా, పలు చోట్ల ఈవీఎంలు(EVMs) మొరాయిస్తున్నాయి. ఈ క్రమంలోనే కర్నూలు(kurnool)లోని 78వ పోలింగ్ కేంద్రంలో ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు.

AP Elections: 7 గంటలకే ఓటు హక్కు వినియోగించుకోనున్న చంద్రబాబు

AP Elections: 7 గంటలకే ఓటు హక్కు వినియోగించుకోనున్న చంద్రబాబు

Andhrapradesh: రాష్ట్ర వ్యాప్తంగా మరికాసేపట్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభంకానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద మాక్ పోలింగ్ ప్రారంభమైంది. ఏజెంట్ల సమక్షంలో అధికారులు మాక్‌ పోలింగ్ నిర్వహించారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు.

ఓటెత్తి జైకొట్టు!

ఓటెత్తి జైకొట్టు!

ఐదేళ్ల పాలన చూశారు..! అంతకు మునుపు ఐదేళ్ల పాలనా చూశారు..! అరాచకాలకు, అభివృద్ధికి తేడాలను గమనించారు. మరో ఐదేళ్ల భవితకు పునాది వేసుకునేందుకు సిద్ధమయ్యారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో పోటెత్తి ఓటేసి.. స్పష్టమైన సంకేతాలను పంపించారు. ఈవీఎంల మీట నొక్కేందుకు మరింత ఉత్సాహంతో సిద్ధమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు విజేతగా నిలిచే సమయం ఆసన్నమైంది. అభ్యర్థుల భవితవ్యం అటుంచితే.. ప్రజాస్వామ్యాన్ని బతికించుకునే బాధ్యత ఓటరుదే. ‘తెల్లారింది లెగండోయ్‌.. కొక్కొరోక్కో..’ అంటూ.. ఓటేసేందుకు తాము వెళ్లడంతోపాటు.. ఇరుగూ పొరుగునూ తట్టిలేపి తీసుకెళ్లాలి. పోలింగ్‌ కేంద్రాలు కళకళలాడాలి. ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి. భవితను మార్చుకోవాలి. అభివృద్ధికి బాటలువేసేవారిని గురిచూసి ఎన్నుకోవాలి. ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి