Home » Vizianagaram
Gunman Bag Missing: ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గన్మెన్ బ్యాగ్ మిస్సవడం తీవ్ర కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. విధి నిర్వహణ నిమిత్తం సాలూరు వెళ్లిన ఆయన.. బ్యాగ్ మిస్ అయినట్లు గుర్తించి వెంటనే విజయనగరం చేరుకుని బ్యాగ్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు.
హిమాలయాల్లో ఉన్నామా విజయనగరం జిల్లాలో ఉన్నామా అనే సందేహం వస్తోంది అక్కడి దృశ్యాలను చూస్తుంటే. ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసినా దారి తెన్ను తెలియని పరిస్థితి.
తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. తెలంగాణలోని రాజన్నసిరిసిల్ల జిల్లా, వేములవాడలో లారీ బీభత్సం సృష్టించింది. అలాగే ఏపీలోని విజయనగరం జిల్లా, బొండపల్లి మండలం, బోడసింగి పేట గ్రామానికి సమీపంలో జాతీయ రహదారిపై అతి వేగంగా వచ్చిన లారీ కారు, బైక్కు ఢీ కొట్టింది.
Tribal:సీతంపేట ఏజెన్సీలో గిరిజన రైతులు వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఒకపక్క ఆరుగాలం కష్టపడి సేకరించిన గిరిజన ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరను జీసీసీ (గిరిజన సహకార సంఘం) కల్పించకపోగా, మరోపక్క ఉన్న అటవీ ఉత్పత్తులను విక్రయించేందుకు అటవీశాఖ అభ్యంతరాలు చెబుతోంది. దీంతో గిరిజన రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
the Shambara fair:శంబర పోలమాంబ జాతరకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
Lord Venkateswara: పట్టణంలోని కంచర వీధిలో గల శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా శనివారం పూలంగి సేవను నిర్వహించారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు గెలుపొందాారు. పార్లమెంట్ సమావేశాలకు ఆయన సైకిల్పై వెళ్తున్నారు.
బ్రిటిష్ కాలంనాటి విమానాశ్రయానికి పూర్వ వైభవం రాబోతోంది. విజయనగరం జిల్లాలోని బాడంగిలో బ్రిటిష్ కాలం నాటి చిన్న విమానాశ్రయం ఉంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రక్షణ అవసరాలకు వినియోగించేవారు. తర్వాత అది నిరుపయోగమైంది. అయితే ఈ విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తే దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడనుంది. అందు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు.
పార్వతీపురం మండలం, నర్సిపురం సమీపంలో కొబ్బరి తోటను ఏనుగుల గుంపు పుర్తిగా ధ్వంసం చేసింది. దాదాపు రెండు వందల కొబ్బరి చెట్లను పుర్తిగా లాగి విసిరేసాయి. ఏనుగుల సంచారంతో సమీపంలో ఉన్న పంట పొలాలు ధ్వంసమయ్యాయి.
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు ఇవాళ(శనివారం) షెడ్యూల్ విడుదల అయింది ఈరోజు నుంచి విజయనగరం జిల్లాలో ఎన్నికల నియమావళి అమలు కానుంది. ఈ నెల 28వ తేదీన విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.