Home » Visaka
విశాఖ: సింహాద్రి అప్పన్న గిరి ప్రదర్శనకు భక్తులు పోటెత్తారు. ఆషాఢ శుద్ద చతుర్దసినాడు గిరి ప్రదర్శనను ప్రారంభించి పౌర్ణమినాడు స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ క్రమంలోనే గిరి ప్రదర్శన చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. 32 కిలోమీటర్ల మేర కాలినడకన చేసే గిరి ప్రదక్షిణలో లక్షలాదిమంది భక్తులు పాల్గొన్నారు.
జగన్ సర్కార్ అనాలోచిత నిర్ణయాల వల్ల ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. వైసీపీ హయాంలో భారీగా కేంద్రం ఇచ్చిన నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆయన ఆరోపించారు. విశాఖలో పర్యటించిన కేంద్ర మంత్రి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తొలిసారిగా ప్రారంభించారని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం విశాఖపట్నం జిల్లా సింహాచలం అడవివరం సమీపంలోని గురుకుల పాఠశాలలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు.
‘సంస్థను నిలబెట్టుకోవాలంటే మీరు త్యాగాలు చేయాల్సిందే. ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. తలోక చేయీ వేయకపోతే మనుగడ కష్టం. ఎవరి స్థాయిలో వారు...
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ఒక మోస్తరుగా కదులుతున్నాయి. అయితే, బంగాళాఖాతంలో రుతుపవనాలు బలంగా ఉండడంతో కోస్తా వైపు తేమగాలులు వీస్తున్నాయి.
రుషికొండపై పర్యాటకులకు మధురానుభూతిని మిగిల్చే టూరిజం కాటేజీలను కూల్చి... కట్టిన ప్యాలస్లు! పేరుకే ఇది టూరిజం ప్రాజెక్టు.. కట్టుకున్నది జగన్ కోసమే! కట్టింది జనం ధనంతోనే..!
సీపీఐ రాష్ట్ర సమితి, కార్యవర్గ సమావేశాలను జూలై 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు.
విశాఖపట్నంలో శనివారం సాయంత్రం సుమారు గంటపాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గంటకు 55 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు, హోర్డింగ్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
విశాఖ: రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా.. ఎవరు తమ వద్దకు వచ్చినా.. తాము ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతామని, దూరమైనా పరవాలేదని, సంపాదించుకోవాలి, దాచుకోవాలనేది కాదని విశాఖ శారద పీఠం స్వరూపానందేంద్రస్వామి అన్నారు. సోమవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..
సినీ గేయ రచయిత, కళాప్రపూర్ణ డా.జాలాది రాజారావు సతీమణి ఆఘ్నేశమ్మ (82) అనారోగ్యంతో ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం సాయంత్రం కన్నుమూశారు.