Home » Vikarabad
లగచర్లలో అధికారులపై దాడి జరిగిన కేసులో రైతులు, ఇతర నిందితుల పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.
భూసేకరణ కోసం ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు వచ్చిన అధికారులపై దాడి ఎలా జరిగిందని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ప్రతినిధుల బృందం.. కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డిని ప్రశ్నించారు.
లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం విచారణ కొనసాగుతోంది. ఇటు రెవెన్యూ, పోలీసు అధికారులతోపాటు అటు సంగారెడ్డి జైలులో రిమాండ్లో ఉన్న లగచర్ల గ్రామస్థులను మానవ హక్కుల సంఘం బృందం ఆదివారం వేర్వేరుగా విచారించింది.
ప్రముఖ సినీ నటుడు మొహ్మద్ అలీకి వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎకమామిడి పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అలీకి ఎకమామిడి గ్రామ పంచాయతీ రెవెన్యూ పరిధి సర్వే నెం.345లో వ్యవసాయ క్షేత్రం ఉంది.
సినీ నటుడు అలీకి అధికారులు నోటీసులు ఇచ్చారు. వికారాబాద్ జిల్లా, నవాబుపేట మండలంలోని ఎక్ మామిడి గ్రామ పంచాయతీ రెవెన్యూలో అలీకి భూమి, ఫామ్హౌస్ ఉంది. అందులో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులు రావడంతో ఈ మేరకు నోటీసు ఇచ్చారు.
మూసీ నది ప్రక్షాళన హైదరాబాద్ నుంచి కాకుండా ఆ నది జన్మించిన అనంతగిరి కొండల నుంచి ప్రారంభించాలని సీఎం రేవంత్రెడ్డిని కోరామని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు.
వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగిన ఘటన ప్రభుత్వ కుట్రేనని.. కలెక్టర్, అధికారులపై దాడి కాదని, అది ధర్మాగ్రహమేనని, దాన్ని సాకుగా తీసుకుని గ్రామాలను వల్లకాడు చేస్తున్నారని సేవాలాల్సేన, పౌరహక్కుల సంఘం, గిరిజన సంఘాలు ఆరోపించాయి.
లగచర్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తముందని పేర్కొంది. ఈ కేసును ఎదుర్కొనేందుకు కేసీఆర్ రూ.10 కోట్లు విడుదల చేశారని వెల్లడించింది.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే లగచర్లలో అమాయక గిరిజన రైతుల్ని రెచ్చగొడుతున్నారని ప్రభుత్వ విప్ రాంచంద్రనాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే బాలూ నాయక్ ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒక నియంతలా ప్రవర్తిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ అన్నారు.