Home » Vikarabad
వికారాబాద్ జిల్లా బషీరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. బషీరాబాద్ కు చెందిన నగేష్ అనే వ్యక్తిని ఓ ఫిర్యాదు విషయమై పోలీసులు విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు రప్పించారు. పోలీస్ స్టేషన్లో ఫిట్స్ రావడంతో స్పృహ కోల్పోయి కుప్పకూలి నగేష్ కింద పడిపోయాడని.. దీంతో వెంటనే చికిత్స నిమిత్తం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.
వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న అతి రుద్ర మహాయాగంలో అపశృతి చోటు చేసుకుంది. చివరి రోజు పూర్ణ ఆహుతిలో మంటలు ఎగిసి పడ్డాయి. టెంట్లు, హోమ గుండాలు కాలి బూడిద అయ్యాయి.
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విద్యార్థిని శిరీష హత్య కేసుకు (Sirisha Murder Case) సంబంధించి ఎస్పీ కోటిరెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. ముడు రోజులు దర్యాప్తు జరిపి శిరీష హత్య కేసు ఛేదించామని ఎస్పీ తెలిపారు. శిరీషను హతమార్చింది బావ అనిల్ అని నిర్ధారణ అయ్యిందన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అనిల్ అని తెలిపారు. ఈ నెల 11న హత్య కేసు 302 నమోదు చేసి.. దర్యాప్తు చేసామని ఎస్పీ వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన శిరీష హత్య కేసుపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ కేసును కమిషన్ సుమోటో కేసుగా స్వీకరించింది. కథలాపూర్లో బాలిక హత్యపై తక్షణమే ఎఫ్ఐఆర్ FIR నమోదు చేసి.. నిందితులను అరెస్ట్ చేయాలని, 3 రోజుల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని తెలంగాణ డీజీపీని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన శిరీష హత్య కేసు మిస్టరీగా మారింది. నిన్న(ఆదివారం) హత్యగానే తేల్చిన పోలీసులు ఇప్పుడు ఆత్మహత్య కోణంలో దర్యాప్తు చేపట్టారు. శిరీష ముఖానికి, శరీర భాగాలపై గాయాలను పరిశీలిస్తే హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు మాత్రం ఎటూ తేల్చక సస్పెన్స్గా కొనసాగిస్తున్నారు.
వికారాబాద్ జిల్లా: పరిగి మండలం కాడ్లాపూర్లో యువతి శిరీష అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. యువతి సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు మమ్మరం చేశారు.
జిల్లాలోని పరిగి కాడ్లాపూర్లో యువతి శిరీష అనుమానాస్పద మృతిపై పరిగి ఎస్సై విఠల్ రెడ్డి స్పందించారు. యువతి అనుమానాస్పద మృతిపై గ్రామస్తులకు పలు అనుమానాలున్నాయన్నారు.
జిల్లాలోని పరిగి కాడ్లాపూర్లో యువతి శిరీష అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల విచారణపై అన్న శ్రీకాంత్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని పరిగి మండలం కాడ్లాపూర్ శిరీష దారుణ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈకేసుకు సంబంధించి అనేక అనుమానాలు నెలకొన్నాయి.
పరిగి మండలం కాడ్లాపూర్లో శిరీష అనే యువతి హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. యువతి మృతదేహాన్ని రీపోస్టుమార్టం చేయించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. రాత్రి పోస్ట్ మార్టం అనంతరం బాడీని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పజెప్పారు. యువతిపై అత్యాచారం అనంతరం హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.