Home » Vijayawada Durga Temple
నవరాత్రి ఉత్సవాల్లో బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు ఉత్తరాంధ్ర నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. దసరా తొలిరోజు నుంచి ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులు తరలివస్తున్నారు. పిల్లలు, పెద్దలు, మహిళలు అనే
శరన్నవరాత్రులు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆ క్రమంలో ఎనిమిదవ రోజు.. అంటే దుర్గాష్టమి. దీంతో అమ్మవారు శ్రీదుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారు దుర్గావతారంలో దుర్గముడు అనే రాక్షసుడిని సంహారించారు. ఈ నేపథ్యంలో దుర్గాష్టమని భక్తులు జరుపుకుంటారు. ఈ దుర్గాష్టమి రోజు ఆయుధపూజ చేస్తారు.
Andhrapradesh: దుర్గగుడి సీనియర్ అసిస్టెంట్ రత్నారెడ్డిని సస్పెండ్ చేస్తూ ఈవో ఆదేశాలు జారీ చేశారు. మూలా నక్షత్రం రోజున వైసీపీ నేతకు రత్నారెడ్డి అంతరాలయం దర్శనం చేయించారు. అంతరాలయం ముందున్న గేటు తాళాలు తీసి మరీ వైసీపీ నేతకు దర్శనం చేసుకునేందుకు అనుమతిచ్చారు.
Andhrapradesh: అమ్మవారి జన్మనక్షత్రం అయిన ఈ రోజు అమ్మవారి దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు పెట్టడం ఆనవాయితీ అని చెప్పుకొచ్చారు. తిరుపతి తరవాత రెండో అతి పెద్ద దేవాలయం దుర్గగుడి అని తెలిపారు.
Andhrapradesh: దుర్గమ్మ ఆలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఆలయ అర్చకులు , దేవాదాయశాఖ మంత్రి ఆనం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చిన్నరాజగోపురం వద్ద సీఎం చంద్రబాబు తలకు ఆలయ అర్చకులు పరివేష్టం చుట్టారు. ఆపై మేళతాళాల నడుమ ప్రభుత్వం తరపున దుర్గమ్మకు సతీసమేతంగా సీఎం పట్టువస్త్రాలను సమర్పించారు.
Andhrapradesh: మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నానని.. ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు అన్నీ పరిశీలించినట్లు హోంమంత్రి తెలిపారు. క్యూ లైన్లో భక్తులతో కూడా మాట్లాడానని.. అందరూ ఏర్పాట్లు బాగున్నాయని ఆనందాన్ని వ్యక్తపరిచారని తెలిపారు.
Andhrapradesh: ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఏర్పాటు చేసిన సదుపాయాలు, సౌకర్యాలను స్వయంగా హోం మినిస్టర్ అనితతో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) బుధవారం పరిశీలించారు. క్యూ లైన్లోని భక్తులతో మాట్లాడి ఆలయ ఏర్పాట్లపై అభిప్రాయాలను హోంమంత్రి, ఎంపీ అడిగి తెలుసుకున్నారు.
దసరా మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. తొమ్మది రోజులపాటు జరిగే అమ్మవారి ఉత్సవాలకు భక్తులు భారీగా వస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ఉత్సవాల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేశారు.
Andhrapradesh: దేవి నవరాత్రులను అద్భుతంగా చేయడానికి అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఇవాళ దర్శనాలు సజావుగా ప్రారంభమయ్యాయని.. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు కల్పిస్తామని చెప్పారు.
Andhrapradesh: రోజుకొక రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాలను భక్తులకు దర్శనమిస్తుంటారు అమ్మవారు. నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవగా.. చివరి రోజు దుర్గాష్టమితో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి.