Home » Venkaiah Naidu
చట్ట సభల్లో హుందాగా మాట్లాడాలని, రాజకీయాలు రోజు రోజుకూ దారుణంగా మారుతున్నాయని... ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియడం లేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) ఇకలేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో మృతిచెందారు.
సీనియర్ నేత డి శ్రీనివాస్ అనారోగ్యంతో ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. డిఎస్ చనిపోయారని చిన్న కుమారుడు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సోషల్ మీడియాలో ఎక్స్లో ట్వీట్ చేశారు.
రామోజీరావు మరణంతో ఒక అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయిందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదు, శక్తిమంతమైన వ్యవస్ధ అని తెలిపారు. ఆయన చేతలు, రాతలు, ఆయన చేపట్టిన కార్యక్రమాలు భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రామోజీ రావు వ్యక్తి కాదని, శక్తివంతమైన వ్యవస్థ అని పేర్కొన్నారు. జీవితంలో స్వయంకృషితో కష్టపడి అనేక రంగాల్లో విజయం సాధించి మనకు దూరమయ్యారని తెలిపారు. ఓ ధృవతారగా వెలుగుతూ ఉంటారని... ఆయన చేతలు, రాతలు, చేపట్టిన కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని భావిస్తున్నానని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
Andhrapradesh: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మవిభూషణ్ స్వీకరించిన వెంకయ్య నాయుడును ఢిల్లీలోని తెలుగు సంఘాలు, ప్రముఖులు, జర్నలిస్టులు అభినందించారు. అనంతరం వెంకయ్య మాట్లాడుతూ... తాను చేసిన సేవలను గుర్తించి కేంద్రం పద్మ విభూషణ్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఉపరాష్ట్రపతిగా పనిచేసిన తరువాత మళ్ళీ రాజకీయాల్లోకి రావడం మంచిది కాదని భవించా..
పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో సోమవారం ఘనంగా జరిగింది. 132 పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో 110 పద్మ శ్రీ అవార్డులు ఉండగా, 17 పద్మభూషణ్ అవార్డులు ఉన్నాయి. 5 పద్మవిభూషణ్ అవార్డులు ఉన్నాయి.
ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు చెరగని ముద్ర వేశారని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను కనకమేడల ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు చెరగని ముద్ర వేశారన్నారు.
ఆరోగ్య సంరక్షణా సౌధానికి నైతిక విలువలే పునాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) అన్నారు. ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బుధవారం నాడు ఘనంగా స్నాతకోత్సవ వేడుకలు నిర్వహించారు.
మహిళలు రాజకీయాల్లో కూడా రాణించాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) అన్నారు. మంగళవారం నాడు తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... రాబోయే రోజుల్లో మహిళలు ముందుకొస్తారని.. పురుషులు వెనక్కి వెళ్తారని చెప్పారు.