Home » Vemuri Radhakrishna
ఆర్థోపెడిక్ వైద్య రంగంలో నిష్ణాతులైన డాక్టర్ల సేవలతో అత్యంత నాణ్యమైన ఆధునిక చికిత్స అందించడమే లక్ష్యంగా డాక్టర్ దినేశ్ సుంకర హైదరాబాద్లోని రాయదుర్గంలో త్రినాయ్ ఆస్పత్రిని ఆదివారం ప్రారంభించారు.
ఆంధ్రజ్యోతి కార్ అండ్ బైక్ రేస్ మెగా డ్రాలో ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రామాపురం గ్రామానికి చెందిన గుడిపూడి శ్రీనివాసరావు మారుతి స్విఫ్ట్ కారును సొంతం చేసుకున్నారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణను తానాప్రతినిధులు శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. జూలై 3వ తేదీ నుంచి 5 వ తేదీ వరకు నిర్వహించే 24వ తానా మహా సభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు.
ఈ ఏడాది జులై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవిలోని సబర్బన్ కలెక్షన్ షోప్లేస్లో నిర్వహించనున్నారు. తానా 24వ ద్వైవార్షిక మహాసభలకు ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను తానా ప్రతినిధులు ఆహ్వానించారు.
జూబ్లీహిల్స్ ఫిలింనగర్ లోని ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఏబీఎన్- ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఎంబీబీఎస్లో సీటు సాధించినా కళాశాల ఫీజులు చెల్లించలేని స్థితిలో ఉన్న ఓ నిరుపేద విద్యార్థినికి ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’ అండగా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు మహర్దశ నడుస్తున్నట్టుగా ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనను ముప్పుతిప్పలు పెట్టడమే కాకుండా చివరకు జైలుకు కూడా పంపిన జగన్మోహన్రెడ్డి జుత్తు మాత్రమే కాదు....
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు బుధవారం హైదరాబాద్లో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు.
‘‘తెలుగు రాష్ట్రాలను ఇంగ్లిష్ అనే వ్యామోహం కమ్మేసింది’’ అని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మినహా మరే రాష్ట్రంలోనూ మాతృభాషకు ప్రమాదం లేదని, ఈ విషయంలో ఒడిశా కూడా మనకన్నా మెరుగ్గానే ఉందని వ్యాఖ్యానించారు.
విజయసాయి వంటి నీచ నికృష్టుడికి ఉన్న తెలివితేటలు తనకు ఉన్నట్టయితే రోత మీడియా వలె ఒకేసారి 23 ఎడిషన్లు ప్రారంభించి ఉండేవాడిని. తాను బ్లాక్ మెయిల్ చేస్తానని, డీల్ మేకర్ని అని కూడా ఈ నీచుడు నిందించాడని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ అన్నారు. బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించే బుద్ధి ఉంటే ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్, జగన్రెడ్డితో ఏకకాలంలో పోరాడాల్సిన అవసరం తనకేంటని ఆర్కే ప్రశ్నించారు.