Home » Vasamsetti Subash
కాకినాడ సిటీ, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పాస్టర్లకు గౌరవ వేతనం తిరిగి అమలులోకి తీసుకురావాలని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మోసా అబ్రహం, కౌన్సిల్ ప్రతినిధులు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ను సోమవారం ఆయన నివాసంలో కలిసి కోరారు. గతంలో రాష్ట్రంలో 8596
వలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసులో వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడి ప్రమేయం ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన ఆరోపణలు చేశారు. కేసు పెట్టకుండా ఉండేందుకు 2 ఎకరాలు ఇస్తానని చెప్పారని అన్నారు. ఆ కేసు దర్యాప్తు ముందుకు వెళ్లకుండా తన మంత్రి పదవిని విశ్వరూప్ అడ్డం పెట్టుకున్నారని ఆరోపించారు.
ద్రాక్షారామంలో పేదల ఇళ్లస్థలాల లేఅవుట్లో ఉంచిన ఇసుకను కేటుగాళ్లు మాయం చేశారు. లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన 70లారీల ఇసుకను రాత్రికి రాత్రే దోచేశారు.
రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ముగ్గురు మృతిచెందగా.. దాదాపు 25మందికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతులు పూడి మోహన్ (20), సీహెచ్ హారిక(22), వై.చిన్నారావు(32)గా గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే గాయపడిన క్షతగాత్రులను హుటాహుటిన అనకాపల్లిలోని పలు ఆస్పత్రులకు తరలించారు.
రాంబిల్లి మండలం అచ్చుతాపురం సెజ్లోని ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి వాసంశెట్టి సుభాశ్(Vasamsetti subhash) తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. 25మందికి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులను అనకాపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈఎస్ఐ హాస్పిటల్ వ్యవస్థని గత ఐదేళ్లలో వైసీపీ భ్రష్టు పట్టించిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. ఈఎస్ఐ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్న 100పడకల హాస్పిటల్ భవనాన్ని, ల్యాబ్స్, డయోగ్నస్టిక్,సెంటర్లని మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం నాడు ప్రారంభించారు.
ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ (NTTPS)లో ఇవాళ (మంగళవారం) అర్ధరాత్రి బాయిలర్ నుంచి మంటలు(Boiler Explosion) చెలరేగి గాయపడిన ఇద్దరు కార్మికులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ (Minister Vasamshetty Subhash), మాజీ మంత్రి దేవినేని ఉమా(Devineni Uma) పరామర్శించారు. అర్ధరాత్రి సమయంలో ఎన్టీటీపీఎస్ ఐదో దశలో బాయిలర్ ఆగిపోవడంతో కార్మికులు మరమ్మతులు చేపట్టారు. ఆ సమయంలో బూడిద నిల్వ తలుపులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. దీంతో మంటలు చేలరేగి ఓ ఉద్యోగి, మరో కాంట్రాక్టు కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి.
Andhrapradesh: నెల్లూరులో మాజీ ముఖ్యమంత్రి జగన్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓటర్లు అందరి ముందూ ఈవీఏం ధ్వంసానికి పాల్పడ్డారని తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజ్లో కూడా ఈవీఏం ధ్వంసం చేసినట్టు బయటపడిందన్నారు.
ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్(Vasamsetti Subhash) బుధవారం కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో పర్యటించారు. అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆధ్యాత్మిక క్షేత్ర అధికారులతో మంత్రి మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా మాజీ ముఖ్యమంత్రి జగన్(YS Jagan)కు మాత్రం ఇంకా జ్ఞానోదయం కాలేదని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్(Minister Vasamshetti Subhash) అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నవరత్నాలపైనే పూర్తిగా ఆధారపడిన జగన్.. బీసీ, ఎస్సీ, ఎస్టీల పథకాలు ఎత్తేశారని గుర్తు చేశారు.