Home » Varanasi
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గంగా సప్తమి పర్వదినాన.. ప్రధాని మోదీ వారాణసీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. అమిత్షా, రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ సహా పలువురు ఎన్డీయే కూటమి నేతలు తదితర అతిరథమహారథులు వెంటరాగా..
రాజ్యాంగాన్ని మార్చనున్నారంటూ విపక్షాలు తనపై చేస్తున్న ఆరోపణలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. తాను రాజ్యాంగ పరిరక్షకుడనని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో మంగళవారంనాడు నామినేషన్ వేసిన అనంతరం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై మోదీ సమాధానమిచ్చారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అనుకరిస్తూ వీడియోలు చేయడంలో పేరున్న యూట్యూబర్, కమెడియన్ శ్యామ్ రంగీలాకు చేదు అనుభవం ఎదురైంది. నరేంద్ర మోదీ మంగళవారంనాడు నామినేషన్ వేసిన వారణాసి (Varanasi) నుంచి పోటీ చేసేందుకు తాను ప్రయత్నించినప్పటికీ నామినేషన్ దాఖలుకు జిల్లా యంత్రాంగం తనను అనుమతించ లేదని ఆయన ఆరోపించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారంనాడు వారాణాసి నుంచి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎన్డీయే భాగస్వామ్య నేతలతో కలెక్టరేట్ కార్యాలయం వెలుపల బలప్రదర్శన చేశారు. ఎన్డీయే కూటమి నేతలు తమ సంఘీభావాన్ని చాటుతూ మోదీ నాయకత్వంలో పనిచేయడం పట్ల హర్షం ప్రకటించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి లోక్ సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. వరసగా మూడోసారి ఇక్కడి నుంచి మోదీ బరిలోకి దిగారు. 2019, 2014లో కూడా వారణాసి నుంచి మోదీ పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే.
ఉత్తరప్రదేశ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM) మంగళవారం వారణాసి (Varanasi)లో నామినేషన్ (Namination) దాఖలు చేశారు. మోదీ సన్నిహితులు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath), మరికొంతమంది ప్రముఖుల సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
ఉత్తరప్రదేశ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో దశాశ్వమేధ ఘాట్ వద్ద గంగానదికి ఆయన పూజలు చేశారు. అక్కడి నుంచి క్రూజ్లో నమో ఘాట్కు వెళ్లారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.
ఉత్తరప్రదేశ్: లోక్ సభ ఎన్నికల(Loksabha elections 2024) నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మంగళవారం ఉత్తరప్రదేశ్ లోని వారణాశి(Varanasi)లో నామినేషన్ వేయనున్నారు. ఈ ప్రక్రియను ఘనంగా నిర్వహించాలని బీజేపీ (BJP) నిర్ణయించింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసిలోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయాన్ని సోమవారం దర్శించనున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈనెల 14వ తేదీన వారణాసి నుంచి ప్రధాన మంత్రి నామినేషన్ వేయనుండటంతో దీనికి ముందుగానే ఆయన కాశీ విశ్వనాథుని ఆశీస్సులు తీసుకోనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రధాని మోదీ(PM Modi) మే 14న ఉత్తరప్రదేశ్లోని వారణాసి(Varanasi) లోక్ సభ స్థానానికి నామినేషన్ సమర్పించనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమిలోని ప్రధాని పార్టీల నేతలను మోదీ ఆహ్వానించారు.